రాచర్లపాడు వద్ద నిలిపి ఉంచిన క్రేన్ను, వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. నెల్లూరు నుంచి టంగుటూరు వైపు వెలుతున్న క్రేన్ టైర్ దెబ్బతినటంతో.. డ్రైవర్ పక్కకు ఆపి పరిశీలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో క్రేన్ డ్రైవర్ అఖిలేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండీ.. మతిస్థిమితం లేని యువకుడు బావిలో పడి మృతి