ETV Bharat / state

Robbery: నకరికల్లులో దారి దోపిడీ.. వారి పనేనా..?

author img

By

Published : May 23, 2022, 2:05 PM IST

Robbery: రాష్ట్రంలో రోజురోజుకు దోపిడీ ఘటనలు పెచ్చుమీరుతున్నాయి. సత్తెనపల్లిలో చోటు చేసుకున్న దారిదోపిడీతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో తాజాగా నకరికల్లులో మరో దారిదోపిడీ ఘటన కలకలం సృష్టించింది. అసలేం జరిగిందంటే..?

robbery
దారిదోపిడీ

Robbery: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద దుండగులు దారిదోపిడీకి పాల్పడ్డారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై దాడిచేసిన దొంగలు... మహిళ మెడలో గొలుసు, సెల్‌ఫోన్‌ లాక్కెళ్లారు. రెండు బైకులపై వచ్చిన ఆరుగురు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. బాధితులు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన రామకృష్ణ, పార్వతిలుగా పోలీసులు తెలిపారు. సత్తెనపల్లిలో రైల్వే స్టేషన్​ సమీపంలో దారిదోపిడీకి పాల్పడిన నిందితులే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Robbery: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద దుండగులు దారిదోపిడీకి పాల్పడ్డారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై దాడిచేసిన దొంగలు... మహిళ మెడలో గొలుసు, సెల్‌ఫోన్‌ లాక్కెళ్లారు. రెండు బైకులపై వచ్చిన ఆరుగురు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. బాధితులు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన రామకృష్ణ, పార్వతిలుగా పోలీసులు తెలిపారు. సత్తెనపల్లిలో రైల్వే స్టేషన్​ సమీపంలో దారిదోపిడీకి పాల్పడిన నిందితులే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.