ETV Bharat / state

నరసరావుపేటలో నకిలీ ధ్రువపత్రాల తయారీ.. ఇద్దరు అరెస్ట్​

author img

By

Published : Nov 1, 2022, 10:09 PM IST

Fake documents: పలు యూనివర్శిటీలలో చదివి ఫెయిలైన విద్యార్థులే వాళ్ల టార్గెట్​. పరీక్షలు రాయకుండానే పాసైనట్లు ధ్రువపత్రాలు పొందొచ్చని ఆశ చూపిస్తారు. వీళ్ల బుట్టలో పడ్డవాళ్ల దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజుతారు. గుట్టుగా సాగుతున్న వీళ్ల వ్యవహారం పోలీసులకు తెలియడంతో.. రంగంలోకి దిగి ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

నకిలీ ధ్రువపత్రాలు
duplicte documents

Fake documents: పల్నాడు జిల్లా నరసరావుపేటలో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న దొప్పలపూడి శ్యామ్ ప్రసన్నకుమార్, శాఖమూరి వెంకట రామారావులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వివిధ యూనివర్సిటీలలో చదివి ఫెయిలైన విద్యార్థుల వద్ద భారీ మొత్తంలో నగదు వసూళ్లు చేసి నకిలీ ధ్రువపత్రాలు అందజేస్తున్నారని జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. నిందితులిద్దరూ పట్టణంలోని ప్రకాష్ నగర్​లో రెండు సైబర్ నెట్ సెంటర్లు ఏర్పాటు చేసి.. నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారన్నారు. వీరికి సహకరిస్తున్న మరో నిందితుడు గుంటూరులో ఉంటున్నట్లు గుర్తించామన్నారు. నిందితులు ఎన్ని కళాశాలలకు సంబంధించిన ధ్రువపత్రాలను.. ఎంతమంది విద్యార్థులకు ఇచ్చారో విచారణ చేస్తున్నామన్నారు. త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.

నిందితుల నుండి రెండు సెల్​ఫోన్లు, ఎంబీఏ ఫేక్ సర్టిఫికెట్, మానిటర్, కలర్ ప్రింటర్, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు. నిందితులను పట్టుకున్నందుకు ఒకటో పట్టణ సీఐ అశోక్ కుమార్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Fake documents: పల్నాడు జిల్లా నరసరావుపేటలో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న దొప్పలపూడి శ్యామ్ ప్రసన్నకుమార్, శాఖమూరి వెంకట రామారావులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వివిధ యూనివర్సిటీలలో చదివి ఫెయిలైన విద్యార్థుల వద్ద భారీ మొత్తంలో నగదు వసూళ్లు చేసి నకిలీ ధ్రువపత్రాలు అందజేస్తున్నారని జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. నిందితులిద్దరూ పట్టణంలోని ప్రకాష్ నగర్​లో రెండు సైబర్ నెట్ సెంటర్లు ఏర్పాటు చేసి.. నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారన్నారు. వీరికి సహకరిస్తున్న మరో నిందితుడు గుంటూరులో ఉంటున్నట్లు గుర్తించామన్నారు. నిందితులు ఎన్ని కళాశాలలకు సంబంధించిన ధ్రువపత్రాలను.. ఎంతమంది విద్యార్థులకు ఇచ్చారో విచారణ చేస్తున్నామన్నారు. త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.

నిందితుల నుండి రెండు సెల్​ఫోన్లు, ఎంబీఏ ఫేక్ సర్టిఫికెట్, మానిటర్, కలర్ ప్రింటర్, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు. నిందితులను పట్టుకున్నందుకు ఒకటో పట్టణ సీఐ అశోక్ కుమార్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.