ACCIDENT: ఎన్టీఆర్ జిల్లా నందిగామ బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. లైటింగ్ సామాన్లతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కోదాడ నుంచి ఉండవల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు ఉండవల్లికి చెందిన అనిల్, ప్రసన్నగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: