ETV Bharat / state

పెళ్లి చేసుకుంటానంటూ.. టిక్‌టాకర్‌ వలపు వల - టిక్‌టాకర్‌ మోసం

TikTok famous girl honey trap : ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో మాయగాళ్లే కాదు.. కిలేడీలు వలపు వల విసురుతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశం చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ముందుగా మేసేజ్​లతో ముగ్గులోకి దింపుతారు. ఆ తరువాత పర్సనల్ వివరాలు అడుగుతారు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి డబ్బు వసూలు చేస్తారు. అలాంటిదే ఈ కథ..

TikTok famous girl honey
టిక్‌టాక్‌ మోసం
author img

By

Published : Dec 18, 2022, 11:07 AM IST

TikTok famous girl honey trap : అందం.. అభినయం.. హావభావాలతో టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకున్న ఆ యువతి.. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాల బాటపట్టింది. పెళ్లి చేసుకుంటానంటూ వలపు వల విసిరి డబ్బు వసూలు చేస్తున్న పరసా తనుశ్రీ(23), ఆమెకు సహకరిస్తున్న పరసా రవితేజ(32)ను అరెస్టు చేసినట్లు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ తెలిపారు. ఫాలోవర్లను వారు మోసగిస్తున్న తీరును ఆయన వివరించారు.

సులువుగా సంపాదించాలని..: ఏపీలోని మచిలీపట్నంకు చెందిన పరసా తనుశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు ఖాతాల ద్వారా సినిమా పాటలు, సంభాషణలు అనుకరిస్తూ వీడియోలు పోస్టు చేసేది. ఈ ఖాతాలను కొన్ని వేలమంది అనుసరిస్తూ కామెంట్లు చేసేవారు. కృష్ణా జిల్లాకు చెందిన పరసా రవితేజతో కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను మోసం చేయడం ప్రారంభించింది. కామెంట్లు పెట్టేవారికి తిరిగి వ్యక్తిగతంగా సందేశాలు పంపించేది.

TikTok famous girl honey
టిక్‌టాక్‌ మోసం

పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి డబ్బు వసూలు చేసేది. ఇలా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో స్నేహం పెరిగాక పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అనంతరం తన తల్లికి అనారోగ్యం తదితర కారణాలు చెప్పి 8 నెలల్లో రూ.31.66 లక్షలు వసూలు చేసింది. ఆమెది మోసమని గ్రహించిన ఆ యువకుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తనుశ్రీ, రవితేజలను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ఇవీ చదవండి:

TikTok famous girl honey trap : అందం.. అభినయం.. హావభావాలతో టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకున్న ఆ యువతి.. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాల బాటపట్టింది. పెళ్లి చేసుకుంటానంటూ వలపు వల విసిరి డబ్బు వసూలు చేస్తున్న పరసా తనుశ్రీ(23), ఆమెకు సహకరిస్తున్న పరసా రవితేజ(32)ను అరెస్టు చేసినట్లు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ తెలిపారు. ఫాలోవర్లను వారు మోసగిస్తున్న తీరును ఆయన వివరించారు.

సులువుగా సంపాదించాలని..: ఏపీలోని మచిలీపట్నంకు చెందిన పరసా తనుశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు ఖాతాల ద్వారా సినిమా పాటలు, సంభాషణలు అనుకరిస్తూ వీడియోలు పోస్టు చేసేది. ఈ ఖాతాలను కొన్ని వేలమంది అనుసరిస్తూ కామెంట్లు చేసేవారు. కృష్ణా జిల్లాకు చెందిన పరసా రవితేజతో కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను మోసం చేయడం ప్రారంభించింది. కామెంట్లు పెట్టేవారికి తిరిగి వ్యక్తిగతంగా సందేశాలు పంపించేది.

TikTok famous girl honey
టిక్‌టాక్‌ మోసం

పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి డబ్బు వసూలు చేసేది. ఇలా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో స్నేహం పెరిగాక పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అనంతరం తన తల్లికి అనారోగ్యం తదితర కారణాలు చెప్పి 8 నెలల్లో రూ.31.66 లక్షలు వసూలు చేసింది. ఆమెది మోసమని గ్రహించిన ఆ యువకుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తనుశ్రీ, రవితేజలను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.