ETV Bharat / state

ష్!!​ గప్​చుప్ - తెలంగాణలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 10:19 AM IST

Updated : Nov 28, 2023, 10:50 AM IST

Telangana Assembly Election Campaign Ends Today : తెలంగాణలో శాసనసభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. కొన్నాళ్లుగా హోరెత్తించిన మైకులు మూగబోనున్నాయి. ప్రచారం పరిసమాప్తితో.. ఆంక్షలు అమలు కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ వర్తించనుంది. ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు.. ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. మద్యం దుకాణాలు కూడా సాయంత్రం నుంచి మూతపడనున్నాయి.

Telangana_Assembly_Election_Campaign_Ends_Today
Telangana_Assembly_Election_Campaign_Ends_Today
ష్!!​ గప్​చుప్ - తెలంగాణలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

Telangana Assembly Election Campaign Ends Today : బహిరంగసభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రలతో.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Telangana Election Campaign) హోరెత్తింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అక్టోబర్ తొమ్మిదో తేదీన ప్రకటన వెలువడగా.. ఈనెల మూడో తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రకటన కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచార పర్వం మరింత ఉద్ధృతంగా సాగింది.

Telangana Election Campaign Concludes Today : తెలంగాణలోని అధికార భారత్ రాష్ట్ర సమితి(BRS)తో పాటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. మజ్లిస్, బీఎస్పీ, వామపక్షాలు సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ఆయా పార్టీల తరపున అగ్రనేతలు తెలంగాణ వ్యాప్తంగా ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షో(Road Shows)లలో పాల్గొన్నారు. తమ పార్టీ విధానాలను వివరిస్తూ, వైరి పక్షాల వైఖరిని ఎండగడుతూ ప్రచారాన్ని వేడెక్కించారు. విమర్శలు, ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచారం కదనరంగాన్ని తలపించింది. ఆయా పార్టీల తరపున ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో(Election Manifestos)లను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గత కొన్నాళ్లుగా హోరెత్తించిన ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.

ఓటర్లతోనే నేతల తలరాత - ఓట్లకు అభ్యర్థుల గాలం

TS Election Polling on November 30th : పోలింగ్‌కు 48గంటల ముందు సైలెన్స్ పీరియడ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 13 నియోజకవర్గాల్లో పోలింగ్(Election Polling) 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. దీంతో ఆ 13 నియోజకవర్గాల్లో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సైలెన్స్ పీరియడ్ ప్రారంభంతో ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు, నిర్వహించరాదు.

అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించుకోవచ్చు : తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్(144 Section) అమల్లోకి వస్తుంది. అభ్యర్థులు, వారి తరపున కేవలం ఇంటింటి ప్రచారం మాత్రమే చేసుకోవచ్చు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు సహా ఇతరత్రా చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తారు. ప్రలోభాల కట్టడిపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడంతోపాటు నిఘా మరింత పటిష్ఠం చేస్తారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలు కట్టుదిట్టం చేస్తారు. మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను సాయంత్రం నుంచి మూసివేయనున్నారు.

హ్యాట్రిక్‌పై ఒకరు- మార్పు కోసం మరొకరు- డబుల్ ఇంజిన్ సర్కార్​ ఏర్పడాలని ఇంకొకరు

Election Polling Arrangements in Hyderabad : పోలింగ్‌ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు(Vote)ను వినియోగించుకోవాలని కోరారు. నల్గొండ జిల్లాలో మొత్తం 1,766 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్ వివరించారు. సాయంత్రం ఐదింటి తర్వాత ఎటువంటి ప్రచారానికి అనుమతి లేదని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ స్పష్టంచేశారు. 13 కంపెనీల పారామిలటరీ దళాలు, పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పోలీసులు, కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల పాటలు

తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న స్టార్‌ క్యాంపెయినర్లు - అభ్యర్థులకు ఎంతవరకు కలిసొచ్చేనో?

ష్!!​ గప్​చుప్ - తెలంగాణలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

Telangana Assembly Election Campaign Ends Today : బహిరంగసభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రలతో.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Telangana Election Campaign) హోరెత్తింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అక్టోబర్ తొమ్మిదో తేదీన ప్రకటన వెలువడగా.. ఈనెల మూడో తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రకటన కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచార పర్వం మరింత ఉద్ధృతంగా సాగింది.

Telangana Election Campaign Concludes Today : తెలంగాణలోని అధికార భారత్ రాష్ట్ర సమితి(BRS)తో పాటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. మజ్లిస్, బీఎస్పీ, వామపక్షాలు సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ఆయా పార్టీల తరపున అగ్రనేతలు తెలంగాణ వ్యాప్తంగా ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షో(Road Shows)లలో పాల్గొన్నారు. తమ పార్టీ విధానాలను వివరిస్తూ, వైరి పక్షాల వైఖరిని ఎండగడుతూ ప్రచారాన్ని వేడెక్కించారు. విమర్శలు, ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచారం కదనరంగాన్ని తలపించింది. ఆయా పార్టీల తరపున ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో(Election Manifestos)లను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గత కొన్నాళ్లుగా హోరెత్తించిన ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.

ఓటర్లతోనే నేతల తలరాత - ఓట్లకు అభ్యర్థుల గాలం

TS Election Polling on November 30th : పోలింగ్‌కు 48గంటల ముందు సైలెన్స్ పీరియడ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 13 నియోజకవర్గాల్లో పోలింగ్(Election Polling) 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. దీంతో ఆ 13 నియోజకవర్గాల్లో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సైలెన్స్ పీరియడ్ ప్రారంభంతో ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు, నిర్వహించరాదు.

అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించుకోవచ్చు : తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్(144 Section) అమల్లోకి వస్తుంది. అభ్యర్థులు, వారి తరపున కేవలం ఇంటింటి ప్రచారం మాత్రమే చేసుకోవచ్చు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు సహా ఇతరత్రా చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తారు. ప్రలోభాల కట్టడిపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడంతోపాటు నిఘా మరింత పటిష్ఠం చేస్తారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలు కట్టుదిట్టం చేస్తారు. మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను సాయంత్రం నుంచి మూసివేయనున్నారు.

హ్యాట్రిక్‌పై ఒకరు- మార్పు కోసం మరొకరు- డబుల్ ఇంజిన్ సర్కార్​ ఏర్పడాలని ఇంకొకరు

Election Polling Arrangements in Hyderabad : పోలింగ్‌ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు(Vote)ను వినియోగించుకోవాలని కోరారు. నల్గొండ జిల్లాలో మొత్తం 1,766 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్ వివరించారు. సాయంత్రం ఐదింటి తర్వాత ఎటువంటి ప్రచారానికి అనుమతి లేదని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ స్పష్టంచేశారు. 13 కంపెనీల పారామిలటరీ దళాలు, పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పోలీసులు, కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల పాటలు

తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న స్టార్‌ క్యాంపెయినర్లు - అభ్యర్థులకు ఎంతవరకు కలిసొచ్చేనో?

Last Updated : Nov 28, 2023, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.