ETV Bharat / state

హైదరాబాద్​లో రూ.కోట్లు కురిపిస్తున్న పాత ఆటోలు.. ఎలాగో తెలుసా.!

author img

By

Published : Jan 2, 2023, 5:02 PM IST

Old Autos Scam: భాగ్యనగరంలో కొందరు రవాణా శాఖ అధికారులు, ఫైనాన్షియర్లు నయా దందాకు తెరలేపారు. వాహన కాలుష్యం దృష్ట్యా కొత్త ఆటోల రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన నేపథ్యంలో పాత ఆటోలను కొని వాటిని తుక్కుకింద మార్చి వాటి స్థానంలో కొత్తవాటికి అనుమతిస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో పాత ఆటోల స్థానంలో కొత్తవాటికి రూ.లక్షలు తీసుకుంటున్నారు. ఒక్కో ఆటోకు రూ.3-4లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారు.

Old Autos Scam
పాత ఆటోల మోసం

Old Autos Scam: తెలంగాణలోని నగర రహదారులపై నడిచే పాత ఆటోలు కొందరు రవాణాశాఖ అధికారులు, ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. వాహన కాలుష్యం దృష్ట్యా కొత్త ఆటోల రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన నేపథ్యంలో పాత ఆటోలను తుక్కుకింద మార్చి వాటి స్థానంలో కొత్తవాటికి అనుమతిస్తున్నారు. కొందరు అధికారులు తుక్కు పద్దు కింద పాత వాటిని రాసేసి కొత్తవాటికి అనుమతులిస్తున్నారు. తుక్కుపేరుతో ఉన్న ఆటోలు యథాప్రకారం నడుస్తున్నాయి. దీన్ని ఆటోడ్రైవర్ల యూనియన్లు వెలికి తీయడంతో రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయాల్లో స్క్రాప్‌ ఆటోల రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపేశారు.

ఇలా జరుగుతున్నాయ్‌.. రుణాలిచ్చే ఫైనాన్షియర్లు పాతఆటోలపై దృష్టిసారించారు. పదిహేనేళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఆటోడ్రైవర్ల అడ్రసులు సేకరిస్తున్నారు. వారి నుంచి తక్కువకు ఆటో కొని, రవాణాశాఖ అధికారులతో కుమ్మక్కై కొత్త ఆటోలను కొని ఫైనాన్స్‌ కింద ఇస్తున్నారు.

చార్మినార్‌ వద్ద ధర్నా చేస్తున్న ఆటో డ్రైవర్లు

రెండు జోన్లలో జోరుగా అక్రమాలు.. రవాణాశాఖ కార్యాలయాల్లో పాత ఆటోల స్థానంలో కొత్తవాటికి రూ.లక్షలు పుచ్చుకుని అనుమతులిస్తున్నారు. ఒక్కో ఆటోకు రూ.3-4లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. మలక్‌పేట, టోలీచౌకి ప్రాంతీయ రవాణాశాఖ కార్యాయాల్లో ఈ అక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. రవాణాశాఖ కార్యాలయాల్లో తుక్కు జాబితాలో ఉన్న ఆటోలు రోడ్లపై తిరుగుతుండడం, స్కూల్‌ విద్యార్థులను తీసుకెళ్తుండడంతో ఆటో డ్రైవర్ల యూనియన్ల సభ్యులకు అనుమానం వచ్చింది. ఆర్టీఏ అధికారుల వైఖరిని నిరసిస్తూ రెండురోజుల క్రితం ధర్నా చేశారు. సమస్యను ఉన్నతాధికారులకు వివరించడంతో స్క్రాప్‌ ఆటోల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపేశారు.

ఇవీ చదవండి:

Old Autos Scam: తెలంగాణలోని నగర రహదారులపై నడిచే పాత ఆటోలు కొందరు రవాణాశాఖ అధికారులు, ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. వాహన కాలుష్యం దృష్ట్యా కొత్త ఆటోల రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన నేపథ్యంలో పాత ఆటోలను తుక్కుకింద మార్చి వాటి స్థానంలో కొత్తవాటికి అనుమతిస్తున్నారు. కొందరు అధికారులు తుక్కు పద్దు కింద పాత వాటిని రాసేసి కొత్తవాటికి అనుమతులిస్తున్నారు. తుక్కుపేరుతో ఉన్న ఆటోలు యథాప్రకారం నడుస్తున్నాయి. దీన్ని ఆటోడ్రైవర్ల యూనియన్లు వెలికి తీయడంతో రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయాల్లో స్క్రాప్‌ ఆటోల రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపేశారు.

ఇలా జరుగుతున్నాయ్‌.. రుణాలిచ్చే ఫైనాన్షియర్లు పాతఆటోలపై దృష్టిసారించారు. పదిహేనేళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఆటోడ్రైవర్ల అడ్రసులు సేకరిస్తున్నారు. వారి నుంచి తక్కువకు ఆటో కొని, రవాణాశాఖ అధికారులతో కుమ్మక్కై కొత్త ఆటోలను కొని ఫైనాన్స్‌ కింద ఇస్తున్నారు.

చార్మినార్‌ వద్ద ధర్నా చేస్తున్న ఆటో డ్రైవర్లు

రెండు జోన్లలో జోరుగా అక్రమాలు.. రవాణాశాఖ కార్యాలయాల్లో పాత ఆటోల స్థానంలో కొత్తవాటికి రూ.లక్షలు పుచ్చుకుని అనుమతులిస్తున్నారు. ఒక్కో ఆటోకు రూ.3-4లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. మలక్‌పేట, టోలీచౌకి ప్రాంతీయ రవాణాశాఖ కార్యాయాల్లో ఈ అక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. రవాణాశాఖ కార్యాలయాల్లో తుక్కు జాబితాలో ఉన్న ఆటోలు రోడ్లపై తిరుగుతుండడం, స్కూల్‌ విద్యార్థులను తీసుకెళ్తుండడంతో ఆటో డ్రైవర్ల యూనియన్ల సభ్యులకు అనుమానం వచ్చింది. ఆర్టీఏ అధికారుల వైఖరిని నిరసిస్తూ రెండురోజుల క్రితం ధర్నా చేశారు. సమస్యను ఉన్నతాధికారులకు వివరించడంతో స్క్రాప్‌ ఆటోల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.