ETV Bharat / state

Frauds in the name of recovery agents: రికవరీ ఏజెంట్ల పేరుతో చోరీ.. మహారాష్ట్రకు పోలీసు బృందాలు

author img

By

Published : Aug 1, 2023, 7:34 PM IST

Thefts in NTR district : కారులో వచ్చారు.. పట్టపగలే దర్జాగా వరుసగా మూడు ఇళ్లల్లో చోరీ చేశారు. రికవరీ ఏజెంట్ల పేరు చెప్పి తాళం వేసిన ఇళ్లల్లో రూ.12 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచేశారు. ఘటనా స్థలాల్లో దొరికిన వేలిముద్రలను సేకరించిన క్లూస్‌ టీం.. వాటిని సరిపోల్చగా మహారాష్ట్రకు చెందిన ముఠాగా గుర్తింపు. ఈ ముఠాను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలు మహారాష్ట్రకు పయనం.

Recovery agents Frauds
Recovery agents Frauds

Frauds in the name of recovery agents : ఎన్టీఆర్‌ జిల్లాలోని పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇటీవల.. ఒకే రోజు పట్టపగలు జరిగిన మూడు వరుస చోరీలు సంచలనం సృష్టించాయి. పగటి పూట తాళం వేసి ఉన్న ఫ్లాట్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. మూడు ఘటనల్లో దాదాపు రూ.12.98 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు, నగదును చోరీ చేశారు. ఈ ముఠా కేవలం అపార్ట్‌మెంట్లనే ఎంచుకుని తమ పని కానిస్తున్నారు. గుంటుపల్లి, గొల్లపూడి మధ్య రెండు, మూడు అపార్ట్‌మెంట్లలోనూ ఈ దొంగలు చోరీకి ప్రయత్నించారు. వాటిలోని వాచ్‌మెన్లు ప్రశ్నించడంతో తాము లోన్‌ రికవరీ ఏజెంట్లమని చెప్పి.. ఏదొక ఫ్లాట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. సంబంధిత ఫ్లాట్‌ యజమాని పేరు చెప్పమని గట్టిగా నిలదీసే సరికి.. తప్పించుకుని వెళ్లిపోయారు.

Daytime robberies in ntr district : నలుగురు దొంగలు తాము వచ్చిన కారులోనే వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. 28వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై తిరిగి ఇబ్రహీంపట్నం మీదుగా మైలవరం వైపు పరారయ్యారు. అక్కడి నుంచి దొంగల ఆనవాళ్లు దొరకలేదు. నలుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠా ఎన్టీఆర్‌ జిల్లాలోకి జులై, 28న ప్రవేశించింది. హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చి.. అదే రోజు సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో మూడు దొంగతనాలు చేసి పరారయ్యారు. ఈ ముఠా జిల్లాలోకి చిల్లకల్లులో ప్రవేశించిన సమయంలో తీసుకున్న సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కారు నెంబరు గురించి ఆరా తీయగా.. అది తప్పుడు నెంబరు అని తేలింది. పోలీసులను తప్పుదారి పట్టించేందుకే ఇలా చేసినట్లు అనుమానిస్తున్నారు.

Gang of robbers from Maharashtra : గొల్లపూడి వన్ సెంటర్, గొల్లపూడి ప్రాంతాల్లోని మూడు అపార్ట్ మెంట్స్​లో దొంగలు చోరీ చేశారు. ఘటనా స్థలాల్లో దొరికిన వేలిముద్రలను సేకరించిన క్లూస్‌ టీం.. వాటిని సరిపోల్చగా మహారాష్ట్రలోని ముఠాకు చెందిన వారివిగా తేలింది. వీరిని పట్టుకునేందుకు సీసీఎస్, భవానీపురం, ఇబ్రహీంపట్నం స్టేషన్ల నుంచి సిబ్బందితో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ముఠా సభ్యులను పట్టుకోవడానికి మహారాష్ట్రకు వెళ్లాయి. మైలవరం మీదుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోకి వెళ్లి ఉండొచ్చని అనుమానంతో అక్కడికి కూడా ఓ బృందం వెళ్లింది.

Theft cases in NTR district : గత నెల జూలై 28న ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగిన సీన్ ఇలా ఉంది... బస్టాండు సమీపంలోని సూర్య అపార్ట్‌మెంట్స్‌ వద్ద .. ఓ తెల్లని కారు వచ్చి ఆగింది. అందులో నుంచి నలుగురు వ్యక్తులు దిగారు. అక్కడున్న వాచ్‌మెన్‌ వారిని వివరాలు అడిగారు. తాము లోన్‌ రికవరీ ఏజెంట్లమని నమ్మించి ఫ్లాట్ నెం. 502కు వెళ్లారు. వారు తమ వెంట తెచ్చుకున్న రాడ్‌తో ప్రధాన తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. ఆ సమయంలో ఫ్లాట్‌ యజమాని లేరు.. నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన దుండగులు మొత్తం 27.2 తులాల బంగారు ఆభరణాలు, రూ.48 వేలు తీసుకుని పరారయ్యారు.

Frauds in the name of recovery agents : ఎన్టీఆర్‌ జిల్లాలోని పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇటీవల.. ఒకే రోజు పట్టపగలు జరిగిన మూడు వరుస చోరీలు సంచలనం సృష్టించాయి. పగటి పూట తాళం వేసి ఉన్న ఫ్లాట్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. మూడు ఘటనల్లో దాదాపు రూ.12.98 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు, నగదును చోరీ చేశారు. ఈ ముఠా కేవలం అపార్ట్‌మెంట్లనే ఎంచుకుని తమ పని కానిస్తున్నారు. గుంటుపల్లి, గొల్లపూడి మధ్య రెండు, మూడు అపార్ట్‌మెంట్లలోనూ ఈ దొంగలు చోరీకి ప్రయత్నించారు. వాటిలోని వాచ్‌మెన్లు ప్రశ్నించడంతో తాము లోన్‌ రికవరీ ఏజెంట్లమని చెప్పి.. ఏదొక ఫ్లాట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. సంబంధిత ఫ్లాట్‌ యజమాని పేరు చెప్పమని గట్టిగా నిలదీసే సరికి.. తప్పించుకుని వెళ్లిపోయారు.

Daytime robberies in ntr district : నలుగురు దొంగలు తాము వచ్చిన కారులోనే వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. 28వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై తిరిగి ఇబ్రహీంపట్నం మీదుగా మైలవరం వైపు పరారయ్యారు. అక్కడి నుంచి దొంగల ఆనవాళ్లు దొరకలేదు. నలుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠా ఎన్టీఆర్‌ జిల్లాలోకి జులై, 28న ప్రవేశించింది. హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చి.. అదే రోజు సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో మూడు దొంగతనాలు చేసి పరారయ్యారు. ఈ ముఠా జిల్లాలోకి చిల్లకల్లులో ప్రవేశించిన సమయంలో తీసుకున్న సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కారు నెంబరు గురించి ఆరా తీయగా.. అది తప్పుడు నెంబరు అని తేలింది. పోలీసులను తప్పుదారి పట్టించేందుకే ఇలా చేసినట్లు అనుమానిస్తున్నారు.

Gang of robbers from Maharashtra : గొల్లపూడి వన్ సెంటర్, గొల్లపూడి ప్రాంతాల్లోని మూడు అపార్ట్ మెంట్స్​లో దొంగలు చోరీ చేశారు. ఘటనా స్థలాల్లో దొరికిన వేలిముద్రలను సేకరించిన క్లూస్‌ టీం.. వాటిని సరిపోల్చగా మహారాష్ట్రలోని ముఠాకు చెందిన వారివిగా తేలింది. వీరిని పట్టుకునేందుకు సీసీఎస్, భవానీపురం, ఇబ్రహీంపట్నం స్టేషన్ల నుంచి సిబ్బందితో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ముఠా సభ్యులను పట్టుకోవడానికి మహారాష్ట్రకు వెళ్లాయి. మైలవరం మీదుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోకి వెళ్లి ఉండొచ్చని అనుమానంతో అక్కడికి కూడా ఓ బృందం వెళ్లింది.

Theft cases in NTR district : గత నెల జూలై 28న ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగిన సీన్ ఇలా ఉంది... బస్టాండు సమీపంలోని సూర్య అపార్ట్‌మెంట్స్‌ వద్ద .. ఓ తెల్లని కారు వచ్చి ఆగింది. అందులో నుంచి నలుగురు వ్యక్తులు దిగారు. అక్కడున్న వాచ్‌మెన్‌ వారిని వివరాలు అడిగారు. తాము లోన్‌ రికవరీ ఏజెంట్లమని నమ్మించి ఫ్లాట్ నెం. 502కు వెళ్లారు. వారు తమ వెంట తెచ్చుకున్న రాడ్‌తో ప్రధాన తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. ఆ సమయంలో ఫ్లాట్‌ యజమాని లేరు.. నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన దుండగులు మొత్తం 27.2 తులాల బంగారు ఆభరణాలు, రూ.48 వేలు తీసుకుని పరారయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.