Heavy Cyber Crime in Vijayawada : సైబర్ నేరగాళ్లు ఎప్పుడికప్పుడు కొత్త ఎత్తులతో బాధితులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పంథాను మార్చి అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. విజయవాడలో సూర్యారావు పేటలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యానికి.. ముఖ్యమంత్రి కార్యాలయం (Chief Minister Office) నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. తన పేరు నాగేశ్వర్ రెడ్డి అని.. ఆసుపత్రులు, రెసిడెన్షియల్ ప్లాట్స్ నిర్మాణం నిమిత్తం భూమి కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. మీ దస్త్రాన్ని సదరు కార్పొరేట్ ఆసుపత్రి ఎండీకి పంపించినట్లు నమ్మించాడు. నిజమని నమ్మిన ఆసుపత్రి యాజమాన్యం అపరిచిత వ్యక్తి చెప్పిన ఐడీలకు విడతల వారీగా 3 లక్షల రూపాయలు చెల్లించారు. ఆ తరువాత షరా మామూలుగానే.. సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) టోకరా వేశారని తెలిసుకుని న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
APP Cheating మాకో యాప్ ఉంది.. దానికో స్కీం ఉంది! విజయవాడ కేంద్రంగా మరో ఆన్లైన్ దగా!
Vijayawada People Worried About Cyber Criminal Cheaters : పటమట పోస్టల్ కాలనీకి చెందిన శివరామ కృష్ణ అనే వృద్ధుడికి మాక్స్ లైఫ్ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నామని ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసారు. గతంలో తీసుకున్న బీమా విషయం గురించి మాట్లాడుతూ.. సిలిగురి శాఖలో కొంత మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారని దీనిపై కోర్టులో కేసు కూడా నమోదైందని నమ్మించారు. మీరు తీసుకున్న బీమా పాలసీ వివరాలు చెబితే పాలసీకి చెందిన 24లక్షలు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. శివరామ కృష్ణ అదంతా నమ్మడంతో పాలసీ రెన్యువల్, పన్నులు, పెన్షన్ ప్లాన్ పేరుతో ఏడున్నర లక్షల వరకు బాధితుని నుంచి సైబర్ కేటుగాళ్లు దోచేశారు. ఎవరికైనా ఈ విధమైన ఫోన్లు, మెయిల్స్ వచ్చినపుడు పరిశీలించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Cyber Fraud With Fake Fingerprints: నకిలీ వేలిముద్రలతో రూ.6 కోట్లు కాజేసిన ముఠా అరెస్టు
Cyber Criminals Fraud With Help of Technology : సైబర్ నేరగాళ్లు నమ్మకంగా మాట్లాడుతూ బాధితులను ఉచ్చులోకి లాగుతున్నారు. ఈ తరహా కేసుల్లో మోసపోయామని బాధితులు ఆలస్యంగా గుర్తిస్తున్నారు. పోలీసులను ఆశ్రయించేలోపే సంబంధిత వ్యక్తుల నగదు వేర్వేరు ఖాతాలకు చేరి.. ఆ తరువాత విత్ డ్రా అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు సైతం ఏం చేయలేకపోతున్నారు. ప్రధానంగా సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో వచ్చే ప్రకటనలు చూసి మోసాలకు తెరలేపుతున్నారని చెబుతున్నారు.
Extortion of Money Through Links on Social Media : సైబర్ నిపుణుల సూచనల : ప్రాససింగ్ ఛార్జీల నిమిత్తం డబ్బులు చెల్లించాలని అపరిచిత వ్యక్తులు నుంచి కాల్స్ వచ్చినా.. ఆర్థిక పరమైన లావాదేవీలు గురించి ప్రస్తావించినా.. వెంటనే సదరు కాల్ను కట్ చేయటం మంచిదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు (Cyber Experts Suggest). లాటరీ టికెట్లు అంటూ పంపే లింకులు, ఆకర్షణీయ ప్రకటనలను అసలు నమ్మద్దని.. వాటిని నమ్మి ఆ లింకుల్ని తెరిస్తే.. ఖాతాల్లో సొమ్ము ఖాళీ కావడం ఖాయమని చెబుతున్నారు. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉంటే మేలని సూచిస్తున్నారు.
Extra Income Scam : ఘరానా మోసం.. అదనపు ఆదాయమని నమ్మించి.. 19 లక్షలు వసూలు.. చివరకు