ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM

author img

By

Published : Dec 12, 2022, 9:00 PM IST

ఏపీ ప్రధాన వార్తలు

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు.. తేల్చిచెప్పిన కేంద్రం
    NO SPECIAL STATUS FOR AP : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ప్రసుత్తం ఉనికిలోనే లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ సుభాష్‌చంద్ర బోస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గడువులోగా పోలవరం పూర్తి కావటం కష్టం: కేంద్రం
    Central Government On Polavaram: పోలవరం ప్రాజెక్ట్​ నిర్మాణంపై కేేంద్ర జల్​శక్తిశాఖ వివరణ ఇచ్చింది. ఎంపీ సుభాష్​ చంద్రబోస్​ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్​ జల్​శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వక సమాధానిమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వారం రోజుల్లో పంట నష్టం అంచనా వేయాలి: సీఎం జగన్​
    Cm Video Conference On Rains: తుపాను కారణంగా ఏర్పడిన వర్షాలపై సీఎం జగన్​ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో.. పంట నష్టాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టాలపై సమీక్షించారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్
    Pawan Kalyan demand help for Farmers: తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎందుకు ధైర్యం చెప్పడం లేదని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై వరుసగా విరుచుకుపడే ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్‌-చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత.. సైనికులకు గాయాలు
    భారత్‌, చైనా సరిహద్దులో మరోసారి సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఇరు దేశాల సైనికులకు స్వల్పంగా గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 2024లో భాజపాకు గట్టి పోటీ ఇచ్చేందుకు KCR అడుగులు!: అఖిలేశ్ యాదవ్​
    వచ్చే లోక్​సభ ఎన్నికలలోపు భాజపా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు బిహార్ సీఎం నీతీశ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు కృషి చేస్తున్నారని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. మైన్​పురి ఎంపీగా గెలుపొందిన డింపుల్ యాదవ్.. ప్రమాణ స్వీకారానికి అఖిలేశ్ యాదవ్​ హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అఫ్గాన్‌లో 'చైనీస్‌ గెస్ట్‌ హౌస్‌‌‌' పై ఉగ్రదాడి
    Kabul Chinese Hotel Attack : అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్​లోని ఓ హోటల్​పై ఉగ్రదాడి జరిగింది. భారీ పేలుడుతో పాటు తుపాకీ పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హమ్మయ్య!.. 11 నెలల కనిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం
    రిటైల్​ ద్రవ్యోల్బణం దిగొచ్చింది. నవంబర్‌ నెలలో వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.88 శాతంగా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'శుభ్‌మన్‌ గిల్‌ పరిస్థితి చూస్తే బాధేస్తోంది'
    ఉత్తమ ప్రదర్శన చేస్తున్నప్పటికీ శుభ్‌మన్‌గిల్‌కు సరైన అవకాశాలు రావట్లేదు. తాజాగా శుభ్‌మన్‌గిల్‌పై మాజీ క్రికెటర్​ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మెగాఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​.. తల్లిదండ్రులు కాబోతున్న రామ్​చరణ్​-ఉపాసన
    ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగాఅభిమానులకు శుభవార్త. రామచరణ్‌ తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్​మీడియాలో ట్వీట్​ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. "హనుమాన్​ జి ఆశిస్సులతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. రామ్​చరణ్​ ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు.. తేల్చిచెప్పిన కేంద్రం
    NO SPECIAL STATUS FOR AP : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ప్రసుత్తం ఉనికిలోనే లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ సుభాష్‌చంద్ర బోస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గడువులోగా పోలవరం పూర్తి కావటం కష్టం: కేంద్రం
    Central Government On Polavaram: పోలవరం ప్రాజెక్ట్​ నిర్మాణంపై కేేంద్ర జల్​శక్తిశాఖ వివరణ ఇచ్చింది. ఎంపీ సుభాష్​ చంద్రబోస్​ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్​ జల్​శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వక సమాధానిమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వారం రోజుల్లో పంట నష్టం అంచనా వేయాలి: సీఎం జగన్​
    Cm Video Conference On Rains: తుపాను కారణంగా ఏర్పడిన వర్షాలపై సీఎం జగన్​ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో.. పంట నష్టాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టాలపై సమీక్షించారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్
    Pawan Kalyan demand help for Farmers: తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎందుకు ధైర్యం చెప్పడం లేదని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై వరుసగా విరుచుకుపడే ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్‌-చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత.. సైనికులకు గాయాలు
    భారత్‌, చైనా సరిహద్దులో మరోసారి సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఇరు దేశాల సైనికులకు స్వల్పంగా గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 2024లో భాజపాకు గట్టి పోటీ ఇచ్చేందుకు KCR అడుగులు!: అఖిలేశ్ యాదవ్​
    వచ్చే లోక్​సభ ఎన్నికలలోపు భాజపా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు బిహార్ సీఎం నీతీశ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు కృషి చేస్తున్నారని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. మైన్​పురి ఎంపీగా గెలుపొందిన డింపుల్ యాదవ్.. ప్రమాణ స్వీకారానికి అఖిలేశ్ యాదవ్​ హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అఫ్గాన్‌లో 'చైనీస్‌ గెస్ట్‌ హౌస్‌‌‌' పై ఉగ్రదాడి
    Kabul Chinese Hotel Attack : అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్​లోని ఓ హోటల్​పై ఉగ్రదాడి జరిగింది. భారీ పేలుడుతో పాటు తుపాకీ పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హమ్మయ్య!.. 11 నెలల కనిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం
    రిటైల్​ ద్రవ్యోల్బణం దిగొచ్చింది. నవంబర్‌ నెలలో వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.88 శాతంగా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'శుభ్‌మన్‌ గిల్‌ పరిస్థితి చూస్తే బాధేస్తోంది'
    ఉత్తమ ప్రదర్శన చేస్తున్నప్పటికీ శుభ్‌మన్‌గిల్‌కు సరైన అవకాశాలు రావట్లేదు. తాజాగా శుభ్‌మన్‌గిల్‌పై మాజీ క్రికెటర్​ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మెగాఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​.. తల్లిదండ్రులు కాబోతున్న రామ్​చరణ్​-ఉపాసన
    ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగాఅభిమానులకు శుభవార్త. రామచరణ్‌ తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్​మీడియాలో ట్వీట్​ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. "హనుమాన్​ జి ఆశిస్సులతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. రామ్​చరణ్​ ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.