గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బంగారుతల్లి, ఒంటరి మహిళ పథకాల్లో లబ్ధిదారులే లక్ష్యంగా కొందరు మోసగాళ్లు దందాలకు తెరతీస్తున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఇలాంటి మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాలలో నలుగురు వ్యక్తులు ప్రజల నుంచి రూ.13 లక్షలు వసూలు చేశారు. పట్టణంలో దేవనగర్ చెందిన నలుగురు వ్యక్తులు దేవనగర్, వీసీ కాలనీ, రెవెన్యూ క్వార్టర్స్ ప్రాంతాలకు చెందిన 200 మంది నుంచి రూ.13 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండీ... గాంధీ 150: మహాత్ముడే ప్రారంభించిన రెండో సబర్మతి