కర్నూలు జిల్లా గూడూరు మండలం నాగలాపురంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాలీ ఆటోను పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు మండలం మునగపాడు నుంచి నాగలాపురం మీదుగా కోడుమూరుకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసి.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై కేశవ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యప్తు ప్రారంభించామన్నారు.
ఇదీ చదవండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు