ETV Bharat / state

భార్య కాపురానికి రాలేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

author img

By

Published : Feb 12, 2020, 2:38 PM IST

కర్నూలు జిల్లా మండల కేంద్రమైన మిడుతూరులో భార్య కాపురానికి రాలేదని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్​చల్ చేశాడు. గడివేముల మండలం బొల్లవరం గ్రామానికి చెందిన మహేష్​కు మిడుతూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన సుభద్రమ్మతో 9 ఏళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య కాపురానికి రాలేదని మిడుతూరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన బాధితుడు... న్యాయం జరగలేదని సెల్ టవర్ ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పోలీసులు, గ్రామపెద్దలు కిందకి దించేలా చర్యలు తీసుకున్నారు.

The husband who climbed the cell tower due to his wife in miduthur at karnool
సెల్ టవర్​పై వ్యక్తి

..

మిడుతూరులో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్​చల్

ఇదీచూడండి.వీరస్వామి... వానరాల ఆత్మబంధువు..!

..

మిడుతూరులో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్​చల్

ఇదీచూడండి.వీరస్వామి... వానరాల ఆత్మబంధువు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.