ఇదీ చదవండి:
సభలో అధికార పార్టీ తీరు ఆందోళనకరం: జిల్లా తెదేపా అధ్యక్షుడు
శాసనసభలో అధికార పార్టీ వైకాపా సభ్యులు వ్యవహరిస్తోన్న తీరు ఆందోళనకరంగా ఉందని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా తమ నాయకుడు చంద్రబాబుపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TDP kurnool president comments on YCP govt over assembly sessions
అసెంబ్లీలో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తోన్న తీరు చాలా ఆందోళనకరంగా ఉందని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడిన ఆయన.. వైకాపా నేతలు సభా సంప్రదాయాలను పాటించకుండా ప్రజలను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు అని చూడకుండా చంద్రబాబు పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తుందని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:
sample description