ETV Bharat / state

రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర సాయమే అధికం : సోము వీర్రాజు

author img

By

Published : Dec 18, 2020, 2:09 PM IST

రాష్ట్రంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయటంలో కేంద్రం తోడ్పాటు ఎంతో ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కానీ కళాశాలను వ్యవసాయ పరిశోధన భూముల్లో ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.

somu verraju comments
సోము వీర్రాజు

రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర సాయమే అధికమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించిన ఆయన వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగే ఇళ్ల నిర్మాణంలో వేల కోట్ల రూపాయల రాయితీ కేంద్రం నుంచి లభించినట్లు ఆయన తెలిపారు. ఇంకా కొన్ని ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేక వెనక్కి పంపారని ఆయన అన్నారు. వైద్యకళాశాల ఏర్పాటులో కేంద్రం తోడ్పాటు ఎంతో ఉందన్నారు. కానీ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన భూముల్లో వైద్యకళాశాల ఏర్పాటు తప్పుడు నిర్ణయమన్నారు.

రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర సాయమే అధికమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించిన ఆయన వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగే ఇళ్ల నిర్మాణంలో వేల కోట్ల రూపాయల రాయితీ కేంద్రం నుంచి లభించినట్లు ఆయన తెలిపారు. ఇంకా కొన్ని ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేక వెనక్కి పంపారని ఆయన అన్నారు. వైద్యకళాశాల ఏర్పాటులో కేంద్రం తోడ్పాటు ఎంతో ఉందన్నారు. కానీ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన భూముల్లో వైద్యకళాశాల ఏర్పాటు తప్పుడు నిర్ణయమన్నారు.

ఇదీ చదవండి: కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.