ETV Bharat / state

నీట మునిగిన సంగమేశ్వర ఆలయం.. ఆలయ పూజారి శిఖర పూజలు

author img

By

Published : Jul 24, 2021, 7:19 PM IST

Updated : Jul 24, 2021, 7:37 PM IST

కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం ఆలయం కృష్ణమ్మ ఒడికి చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద శ్రీశైలం జలాశయంలోకి చేరడంతో ఆలయ గోపురం వరకు నీరు చేరింది.

tirupati- gold
నీట మునిగిన సంగమేశ్వర ఆలయం

నీట మునిగిన సంగమేశ్వర ఆలయం

కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. ఎగువ నుంచి వచ్చే భారీ వరదనీటితో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరిగింది. దీంతో ఆలయ గోపురం వరకు నీరు చేరింది. ఆలయ పూజారి రఘురామశర్మ శిఖర పూజలు నిర్వహించారు. మరో వైపు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 3,15,576 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 854.80 అడుగులకు చేరింది.

నీట మునిగిన సంగమేశ్వర ఆలయం

కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. ఎగువ నుంచి వచ్చే భారీ వరదనీటితో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరిగింది. దీంతో ఆలయ గోపురం వరకు నీరు చేరింది. ఆలయ పూజారి రఘురామశర్మ శిఖర పూజలు నిర్వహించారు. మరో వైపు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 3,15,576 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 854.80 అడుగులకు చేరింది.

ఇదీ చదవండి.. ప్రకాశం బ్యారేజికి వరద ప్రవాహం.. 70 గేట్లు ఎత్తి దిగువకు విడుదల

Last Updated : Jul 24, 2021, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.