కర్నూలు జిల్లా ఆదోనిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. సంక్షేమ హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. నీటి సమస్యను పరిష్కరించట్లేదని.. మూడు నెలలుగా వైద్యులు పరీక్షలు చేయడానికి రావడం లేదని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేసారు. అనంతరం ఆర్డీఓ బాలగణేశయ్య సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.
ఇదిచూడండి.పల్లె మొత్తం ప్రకృతి బాట...