ETV Bharat / state

విద్యుత్ కాంతులు.. మెరిసిపోతున్న రాఘవేంద్ర స్వామి మఠం

author img

By

Published : Nov 23, 2020, 10:20 PM IST

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతుంది. తుంగభద్ర పుష్కరాల నేపథ్యంలో మఠాన్ని సుందరంగా అలంకరించారు.

raghavendra swamy temple decorate with lighting at mantralayam
విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్న రాఘవేంద్ర స్వామి మఠం

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతోంది. రంగు రంగుల దీపాలతో మఠాన్ని సుందరంగా అలంకరించారు. విద్యుత్ కాంతులు, భక్తులతో స్వామి వారి మఠం కళకళలాడుతోంది. మఠం ఆచార సంప్రదాయాల ప్రకారం స్వామి వారికి పూజలు నిర్వహిస్తున్నారు. పుష్కరాలు, కార్తీక సోమవారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఇదీ చూడండి:

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతోంది. రంగు రంగుల దీపాలతో మఠాన్ని సుందరంగా అలంకరించారు. విద్యుత్ కాంతులు, భక్తులతో స్వామి వారి మఠం కళకళలాడుతోంది. మఠం ఆచార సంప్రదాయాల ప్రకారం స్వామి వారికి పూజలు నిర్వహిస్తున్నారు. పుష్కరాలు, కార్తీక సోమవారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఇదీ చూడండి:

తుంగభద్ర పుష్కరాలు..మంత్రాలయానికి తరలివస్తున్న భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.