ETV Bharat / state

'పుష్కరాలు సమీపిస్తున్నాయి.. ఇంకా పనులు పూర్తి కాలేదు' - tungabadhra pushkaralu

కర్నూలు నగరంలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల నిర్మాణంలో లోపాలున్నాయని తెదేపా నేతలు మండిపడ్డారు. ఈనెల 20 నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కార్యకర్తలతో కలిసి పుష్కర ఘాట్లను పరిశీలించారు.

'పుష్కరాలు సమీపిస్తున్నాయి.. ఇంకా పనులు పూర్తి కాలేదు'
'పుష్కరాలు సమీపిస్తున్నాయి.. ఇంకా పనులు పూర్తి కాలేదు'
author img

By

Published : Nov 6, 2020, 11:25 PM IST

కర్నూలు నగరంలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదని.. తెదేపా నేతలు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.

ఈనెల 20 నుంచి పుష్కరాలు..

కార్యకర్తలతో కలిసి సంకల్ బాగ్, నాగ సాయిబాబా ఆలయం, సాయిబాబా ఆలయం వద్ద నిర్మిస్తున్న పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఈ నెల 20 నుంచి పుష్కరాలు జరగనున్నాయని.. ఇప్పటి వరకు కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. అవినీతికి పాల్పడే ఉద్దేశంతోనే పనులు సాగిస్తున్నట్లు కనిపిస్తోందని నేతలు అనుమానం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : 'రాజధాని కేసుల విచారణపై డిసెంబరులో తీర్పు'

కర్నూలు నగరంలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదని.. తెదేపా నేతలు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.

ఈనెల 20 నుంచి పుష్కరాలు..

కార్యకర్తలతో కలిసి సంకల్ బాగ్, నాగ సాయిబాబా ఆలయం, సాయిబాబా ఆలయం వద్ద నిర్మిస్తున్న పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఈ నెల 20 నుంచి పుష్కరాలు జరగనున్నాయని.. ఇప్పటి వరకు కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. అవినీతికి పాల్పడే ఉద్దేశంతోనే పనులు సాగిస్తున్నట్లు కనిపిస్తోందని నేతలు అనుమానం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : 'రాజధాని కేసుల విచారణపై డిసెంబరులో తీర్పు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.