ETV Bharat / state

పంచలింగాల చెక్​పోస్టు వద్ద 3 కిలోల గంజాయి పట్టివేత

author img

By

Published : Nov 2, 2021, 5:28 PM IST

పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా గంజయి, మద్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా పంచలింగాల చెక్​పోస్టు వద్ద మూడు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో గణేశ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

పంచలింగాల చెక్​పోస్టు వద్ద 3 కిలోల గంజాయి పట్టివేత
పంచలింగాల చెక్​పోస్టు వద్ద 3 కిలోల గంజాయి పట్టివేత

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్​పోస్టు వద్ద మూడు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గణేశ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సును పోలీసులు తనిఖీ చేయగా గణేశ్ వద్ద గంజాయి పట్టుబడింది. మరో కేసులో పంచలింగాల గ్రామానికి చెందిన మధుబాబు, జమీర్ బాషా అనే వ్యక్తులు ద్విచక్రవాహనంపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మద్యం సీసాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసినట్లు సెబ్ సీఐ మంజుల తెలిపారు.

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్​పోస్టు వద్ద మూడు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గణేశ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సును పోలీసులు తనిఖీ చేయగా గణేశ్ వద్ద గంజాయి పట్టుబడింది. మరో కేసులో పంచలింగాల గ్రామానికి చెందిన మధుబాబు, జమీర్ బాషా అనే వ్యక్తులు ద్విచక్రవాహనంపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మద్యం సీసాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసినట్లు సెబ్ సీఐ మంజుల తెలిపారు.

ఇదీ చదవండి: Arrest: భారీగా ఎర్రచందనం పట్టివేత.. అంతర్జాతీయ రవాణా ముఠా అరెస్టు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.