చిత్తూరు జిల్లా పలమనేరు తహసీల్దార్ శ్రీనివాసులు మానవత్వాన్ని చాటుకున్నారు. గత నెలలో పలమనేరు రహదారిపై అనాథగా ఉన్న వృద్ధురాలిని ఆయన చేరదీసి జిల్లా కేంద్రంలోని స్థానిక అమ్మఒడి ఆశ్రమంలో చేర్చారు. వృద్ధాప్యంతో ఆమె శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ క్రమంలో ఆశ్రమ నిర్వాహకులతో కలిసి.. తహసీల్దార్ ఆమె పాడెను మోసి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి..