కర్నూలు నగర పాలక సంస్థ ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. గత 24 సంవత్సరాల పనిచేస్తున్న తమను జులై నెలలో తొలగించారని కార్మికులు వాపోయారు. తిరిగి పనిలోకి రావాలంటే లక్ష రుపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను కమిషనర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించి పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి