ETV Bharat / state

కాచిగూడలో ఎంఎంటీఎస్, కర్నూలు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఢీ

హైదరాబాద్​ కాచిగూడ రైల్వే స్టేషన్​లో రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కర్నూలు ఇంటర్​ సిటీ ఎక్స్​ప్రెస్​ను ఎంఎంటీఎస్​​ రైలు​ ఢీ కొట్టింది. సిగ్నల్​ లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

author img

By

Published : Nov 11, 2019, 1:28 PM IST

ఎంఎంటీఎస్​ రైల్​ క్యాబిన్​లో చిక్కుకున్న లోకో పైలెట్​
కాచిగూడలో ఎంఎంటీఎస్, కర్నూలు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఢీ

హైదరాబాద్​ కాచిగూడ రైల్వేస్టేషన్​లో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్​పై ఆగి ఉన్న కర్నూలు ఇంటర్​ సిటీ ఎక్స్​ప్రెస్​ను ఎంఎంటీఎస్​ రైలు​ ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుమారు పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. రైల్వే అధికారులపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ట్రాక్​పై రైలు నిలిచి ఉన్నప్పుడు మరో రైలుకు ఎలా సిగ్నల్ ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. రైల్వే పోలీసులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్యాబిన్​లో చిక్కుకున్న లోకో పైలెట్​

ఈ ఘటనలో రైల్‌ క్యాబిన్‌లో ఎంఎంటీఎస్​ లోకో పైలెట్‌ చిక్కుకున్నాడు. రైలు ముందు భాగం నుజ్జునుజ్జు కావడం వల్ల లోకో పైలెట్‌ను బయటకు తీసేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గంటకు పైగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:

అయోధ్యలో రామమందిరానికై 27 ఏళ్లుగా ఉపవాసం!

కాచిగూడలో ఎంఎంటీఎస్, కర్నూలు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఢీ

హైదరాబాద్​ కాచిగూడ రైల్వేస్టేషన్​లో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్​పై ఆగి ఉన్న కర్నూలు ఇంటర్​ సిటీ ఎక్స్​ప్రెస్​ను ఎంఎంటీఎస్​ రైలు​ ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుమారు పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. రైల్వే అధికారులపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ట్రాక్​పై రైలు నిలిచి ఉన్నప్పుడు మరో రైలుకు ఎలా సిగ్నల్ ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. రైల్వే పోలీసులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్యాబిన్​లో చిక్కుకున్న లోకో పైలెట్​

ఈ ఘటనలో రైల్‌ క్యాబిన్‌లో ఎంఎంటీఎస్​ లోకో పైలెట్‌ చిక్కుకున్నాడు. రైలు ముందు భాగం నుజ్జునుజ్జు కావడం వల్ల లోకో పైలెట్‌ను బయటకు తీసేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గంటకు పైగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:

అయోధ్యలో రామమందిరానికై 27 ఏళ్లుగా ఉపవాసం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.