పేదలకు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులను ఇంటింటికీ సరఫరా చేసే వాహనాలను కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మంత్రి గుమ్మనూరు జయరాం గురువారం ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 2346 రేషన్ షాపులు ఉన్నాయని మంత్రి తెలిపారు. 760 మినీ ట్రక్కు వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే.. రేషన్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: హైకోర్టు తీర్పుపై సుప్రీంలో అప్పీల్ చేస్తాం: ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య