కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో వర్తకులు, వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లతో కరోనా నివారణ గురించి డీఎస్పీ నరసింహారెడ్డి, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నిత్యావసర సరుకులు, మెడికల్ షాప్లకు సంబంధించిన దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. కరోనాను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు అని హెచ్చరించారు. నిబంధనలు, ఆంక్షల మేరకు ఈ నెల 31 వరకు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు మొత్తం మూసివేయాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: