ETV Bharat / state

ఎన్​ఆర్సీ, ఎన్​పీఆర్​లను రాష్ట్రంలో​ అమలు చేయం: గంగుల ప్రభాకర్​రెడ్డి

author img

By

Published : Jun 28, 2020, 5:06 PM IST

ఎన్​ఆర్సీ, ఎన్​పీఆర్​లపై అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానంపై కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ముస్లిం వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిలను ముస్లిం పెద్దలు సన్మానించారు. వైకాపా మొదట్నుంచీ ముస్లింలకు మద్దతుగా నిలిచిందని గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎన్​ఆర్సీ, ఎన్​పీఆర్​లను రాష్ట్రంలో అమలు చేయమని ఆయన ముస్లింలకు హామీ ఇచ్చారు.

ఎన్​ఆర్సీ, ఎన్​పీఆర్​ ఎట్టి పరిస్థితుల్లో అమలుచేయం : గంగుల ప్రభాకర్ రెడ్డి
ఎన్​ఆర్సీ, ఎన్​పీఆర్​ ఎట్టి పరిస్థితుల్లో అమలుచేయం : గంగుల ప్రభాకర్ రెడ్డి

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ముస్లిం సంఘాలు శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిలను ఘనంగా సన్మానించాయి. అసెంబ్లీలో ఎన్​ఆర్సీ, ఎన్​పీఆర్​ అమలుకు వ్యతిరేకంగా తీర్మానం చేయటం పట్ల ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను ముస్లిం సంఘ నేతలు శాలువా కప్పి, పూలమాలలు వేసి అభినందించారు. అల్ప సంఖ్యాకులైన ముస్లింలకు వైకాపా ప్రభుత్వం మద్దతుగా నిలవాలన్నారు.

ఎన్​పీఆర్​, ఎన్​ఆర్సీ రాష్ట్రంలో అమలు చేయకుండా వైకాపా కృషి చేయాలని ముస్లిం మతపెద్దలు కోరారు. ఈ రెండు చట్టాలను అమలు చేయాలని కేంద్రం పట్టుదలతో ఉందని, ఇవి అమలైతే ముస్లింలకు భద్రత కరువు అవుతుందని అన్నారు. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం మొదటినుంచి ముస్లింలకు మద్దతుగా నిలిచిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు చట్టాలను రాష్ట్రంలో అమలు కాకుండా చూస్తామని ముస్లింలకు హామీ ఇచ్చారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ముస్లిం సంఘాలు శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిలను ఘనంగా సన్మానించాయి. అసెంబ్లీలో ఎన్​ఆర్సీ, ఎన్​పీఆర్​ అమలుకు వ్యతిరేకంగా తీర్మానం చేయటం పట్ల ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను ముస్లిం సంఘ నేతలు శాలువా కప్పి, పూలమాలలు వేసి అభినందించారు. అల్ప సంఖ్యాకులైన ముస్లింలకు వైకాపా ప్రభుత్వం మద్దతుగా నిలవాలన్నారు.

ఎన్​పీఆర్​, ఎన్​ఆర్సీ రాష్ట్రంలో అమలు చేయకుండా వైకాపా కృషి చేయాలని ముస్లిం మతపెద్దలు కోరారు. ఈ రెండు చట్టాలను అమలు చేయాలని కేంద్రం పట్టుదలతో ఉందని, ఇవి అమలైతే ముస్లింలకు భద్రత కరువు అవుతుందని అన్నారు. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం మొదటినుంచి ముస్లింలకు మద్దతుగా నిలిచిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు చట్టాలను రాష్ట్రంలో అమలు కాకుండా చూస్తామని ముస్లింలకు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి : 'సొంత వ్యాపార సంస్థ కోసం సీఎం జగన్‌ జల చౌర్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.