కర్నూలు జిల్లా డోన్లోని ఎస్కేపీ ఉన్నత పాఠశాలలో 1988-89 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వేడుకగా జరిగింది. తమకు చదువు చెప్పిన గురువులను రథంలో కూర్చోబెట్టి ఊరేగించారు. ముక్తేశ్వర ఆలయం నుండి పాత బస్టాండ్ మీదుగా మధు ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ చేపట్టి, వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. మధు ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థులంతా సమావేశమవగా.. గురువులకు సన్మానం చేసి ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులలో మృతి చెందిన కొందరు విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు.
ఇదీ చూడండి: