కర్నూలు జిల్లా హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఈఈగా విధులు నిర్వహిస్తున్న సత్యప్రసాద్ రెడ్డి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన భార్య హైదారాబాద్లో ఉండగా.. కుమార్తె అమెరికాలోని వరల్డ్ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నారు. సత్యప్రసాద్ ఒంటరిగా నివసించేవాడు. అయితే సత్యప్రసాద్రెడ్డికి ఆత్మహత్య సమస్యలు లేవని ఆయన కుటుంబ సభ్యులు తోటి ఉద్యోగులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.