కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారాన్ని విడుదల చేసింది. ఈ ఘటనలో మరణించిన 14 మందికి రూ. 2 లక్షలు, నలుగురు క్షతగాత్రులకు రూ.1 లక్ష చొప్పున ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం రూ. 32 లక్షలను సీఎం సహాయ నిధి నుంచి విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆర్థిక సాయాన్ని తక్షణం బాధితులకు అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్కు సూచించింది.
అనుబంధ కథనం:
రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన టెంపో వాహనం.. 14 మంది దుర్మరణం