ETV Bharat / state

సాగునీరెటూ లేదు..తాగునీరైనా ఇవ్వండి సార్!

ఓ వైపు వరద నీటితో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, కర్నూలు జిల్లాలో నీటి కటకటతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. సాగునీరు ఇవ్వలేకపోయిన అధికార్లు, కనీసం తాగునీరైన ఇవ్వాలని నగర వాసులు కమిషనర్ ఇంటిని ముట్టడించారు.

author img

By

Published : Aug 16, 2019, 7:24 PM IST

సాగునీరెటూ లేదు.. తాగునీరైనా ఇవ్వండి సార్...!
సాగునీరెటూ లేదు.. తాగునీరైనా ఇవ్వండి సార్...!

కర్నూలు నగరంలోని పలు కాలనీలకు వారం రోజులైనా తాగునీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని రెండవ వార్డుకు చెందిన స్థానికులు నీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ ఇంటిని ముట్టడించారు. కమిషనర్ తో వాగ్వవాదానికి దిగారు. స్పందించిన కమిషనర్ వరద నీరు కారణంగా శుద్ది చేయడానికి సమయం పడుతోందని అందువలనే నీటి సరఫరా ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులంతా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నా ఒక్కరు కూడా సమస్యను పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు.

ఇదీ చూడండి:పథకాల అమలుకు వాలంటీర్లు వారధులుగా పనిచేయాలి: బొత్స

సాగునీరెటూ లేదు.. తాగునీరైనా ఇవ్వండి సార్...!

కర్నూలు నగరంలోని పలు కాలనీలకు వారం రోజులైనా తాగునీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని రెండవ వార్డుకు చెందిన స్థానికులు నీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ ఇంటిని ముట్టడించారు. కమిషనర్ తో వాగ్వవాదానికి దిగారు. స్పందించిన కమిషనర్ వరద నీరు కారణంగా శుద్ది చేయడానికి సమయం పడుతోందని అందువలనే నీటి సరఫరా ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులంతా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నా ఒక్కరు కూడా సమస్యను పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు.

ఇదీ చూడండి:పథకాల అమలుకు వాలంటీర్లు వారధులుగా పనిచేయాలి: బొత్స

Intro:ATP:- పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ లను వెంటనే తెరవాలని తెదేపా మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు. తెదేపా అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపుమేరకు అనంతపురంలోని అన్న క్యాంటీన్ వద్ద తెదేపా పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలియజేశారు.


Body:ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు అతి తక్కువ ధరకు నాణ్యమైన భోజనాన్ని అందించడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు తీసుకున్న మంచి నిర్ణయాన్ని అన్నా క్యాంటీన్ల పేరుతో అమలు చేశామన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మూడు నెలల వ్యవధిలోనే అక్రమాల ఆరోపణలు చేస్తూ పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ లను మూసివేయడం దారుణమన్నారు. వెంటనే అన్న క్యాంటీన్లలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం అన్న దానం చేస్తూ నిరసన తెలిపారు.

బైట్..... పరిటాల సునీత , మాజీ మంత్రి . అనంతపురం జిల్లా


Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.