ETV Bharat / state

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడించటమే మా లక్ష్యం: సీపీఐ రామకృష్ణ

author img

By

Published : Mar 10, 2023, 2:59 PM IST

TDP AND CPI LEADERS PRESS MEET: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్​ కేవలం అధికారం కోసం దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల పరస్పర సహకారంతో వైసీపీని ఓడిస్తామన్నారు.

TDP AND CPI LEADERS PRESS MEET
TDP AND CPI LEADERS PRESS MEET

TDP AND CPI LEADERS PRESS MEET: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీపీఐ కలిసి అధికార పార్టీ వైసీపీని ఓడిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కర్నూలులో తెలిపారు. కర్నూలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, సీపీఐ నాయకులు సంయుక్తంగా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామగోపాల్​ రెడ్డికి రెండవ ప్రాధాన్యత ఓటు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నర్సింహారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

"రాష్ట్రానికి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా పట్టుభద్రుల నియోజకవర్గంలో, అలాగే టీచర్స్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదు. మొట్టమొదటిసారి జగన్​ మోహన్​ రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బుతో దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో కేవలం తమ మాట మాత్రమే గెలవాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ఇలాంటి పద్ధతులకు పాల్పడుతున్నారు. దొంగ ఓట్లు సృష్టించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నాం. వైసీపీని ఓడించాలన్న ఉద్దేశంతో మేమంతా ఏకమైయ్యాము. మొదటి ప్రాధాన్యత ఓటును పీడీఎఫ్​ అభ్యర్థికి, రెండో ప్రాధాన్యత ఓటును టీడీపీ అభ్యర్థికి వేస్తాం"-రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నందు వల్లే ప్రతిపక్ష పార్టీలు పరస్పర సహకారం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దొంగ ఓట్లతో గెలవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ స్పందించి దొంగ ఓట్లు నమోదు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు నమోదు చేసుకున్నట్లు బయటపడిందని రామకృష్ణ విమర్శించారు.

పరస్పర సహకారంతో వైసీపీ ఓడించేందుకు సిద్ధం: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటును తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వేసి, రెండో ప్రాధాన్యత ఓటును పీడీఎఫ్ అభ్యర్థి నాగరాజుకు వెయ్యాలని కోరారు. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు తమ గ్రామాల పరిధిలో అభివృద్ధి జరిగి ఉంటే అధికార పార్టీ వైసీపీకు ఓటు వెయ్యాలని.. లేని పక్షంలో సర్పంచ్​ల సంఘం తరుపున పోటీ చేసిన మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలని ఆయన కోరారు.

ఇవీ చదవండి:

TDP AND CPI LEADERS PRESS MEET: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీపీఐ కలిసి అధికార పార్టీ వైసీపీని ఓడిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కర్నూలులో తెలిపారు. కర్నూలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, సీపీఐ నాయకులు సంయుక్తంగా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామగోపాల్​ రెడ్డికి రెండవ ప్రాధాన్యత ఓటు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నర్సింహారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

"రాష్ట్రానికి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా పట్టుభద్రుల నియోజకవర్గంలో, అలాగే టీచర్స్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదు. మొట్టమొదటిసారి జగన్​ మోహన్​ రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బుతో దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో కేవలం తమ మాట మాత్రమే గెలవాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ఇలాంటి పద్ధతులకు పాల్పడుతున్నారు. దొంగ ఓట్లు సృష్టించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నాం. వైసీపీని ఓడించాలన్న ఉద్దేశంతో మేమంతా ఏకమైయ్యాము. మొదటి ప్రాధాన్యత ఓటును పీడీఎఫ్​ అభ్యర్థికి, రెండో ప్రాధాన్యత ఓటును టీడీపీ అభ్యర్థికి వేస్తాం"-రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నందు వల్లే ప్రతిపక్ష పార్టీలు పరస్పర సహకారం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దొంగ ఓట్లతో గెలవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ స్పందించి దొంగ ఓట్లు నమోదు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు నమోదు చేసుకున్నట్లు బయటపడిందని రామకృష్ణ విమర్శించారు.

పరస్పర సహకారంతో వైసీపీ ఓడించేందుకు సిద్ధం: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటును తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వేసి, రెండో ప్రాధాన్యత ఓటును పీడీఎఫ్ అభ్యర్థి నాగరాజుకు వెయ్యాలని కోరారు. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు తమ గ్రామాల పరిధిలో అభివృద్ధి జరిగి ఉంటే అధికార పార్టీ వైసీపీకు ఓటు వెయ్యాలని.. లేని పక్షంలో సర్పంచ్​ల సంఘం తరుపున పోటీ చేసిన మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలని ఆయన కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.