కర్నూలు జిల్లాలోని ప్రజలను తీవ్రంగా వేదిస్తున్న నీటి సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని కోరుతూ...సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కర్నూలు నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొందని ప్రజలు నిరసన తెలిపారు. తుంగభద్ర జలాశయం నుంచి తక్షణమే రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి