కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని పెరవలి శ్రీరంగనాథస్వామి ఆలయానికి త్రిదండి చినజీయర్ విచ్చేశారు. స్వామిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతంగా పేర్కొన్నారు. 3 వేల సంవత్సరాల క్రితమే స్వామివారు పెరవలిలో వెలిశారని చెప్పారు. 14 వ శతాబ్దంలోనే నిర్మించిన ఈ ఆలయాన్ని, కాపాడుకుంటూ వస్తున్నవారికి రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరోసారి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఐదు రోజుల పాటు ఇక్కడే ఉంటనని పేర్కొన్నారు.
శ్రీరంగనాథస్వామి సన్నిధికి చినజీయర్ స్వామి - చినజీయర్ తాజా న్యూస్
కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని పెరవలి శ్రీరంగనాథస్వామిని చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. మరోసారి స్వామివారి దర్శినానికి వచ్చేటప్పుడు ఐదు రోజుల పాటు ఇక్కడే ఉంటానని అన్నారు.
![శ్రీరంగనాథస్వామి సన్నిధికి చినజీయర్ స్వామి Chinjiyar visited Peravali Sriranganathaswamy in Kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10290359-315-10290359-1610984212493.jpg?imwidth=3840)
పెరవలి శ్రీరంగనాథస్వామిని దర్శించుకున్న చినజీయర్
కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని పెరవలి శ్రీరంగనాథస్వామి ఆలయానికి త్రిదండి చినజీయర్ విచ్చేశారు. స్వామిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతంగా పేర్కొన్నారు. 3 వేల సంవత్సరాల క్రితమే స్వామివారు పెరవలిలో వెలిశారని చెప్పారు. 14 వ శతాబ్దంలోనే నిర్మించిన ఈ ఆలయాన్ని, కాపాడుకుంటూ వస్తున్నవారికి రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరోసారి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఐదు రోజుల పాటు ఇక్కడే ఉంటనని పేర్కొన్నారు.