ETV Bharat / state

శేషవాహనంపై అహోబిలం లక్ష్మీ నరసింహుడి దర్శనం

author img

By

Published : Mar 22, 2021, 7:51 PM IST

అహోబిలంలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఎగువ అహోబిలంలో స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వామిని మాఢవీధుల్లో విహరింపజేశారు.

Ahobilam Lakshmi Narasimha swamy
శేషవాహనంపై అహోబిలం లక్ష్మీ నరసింహుడు

కర్నూలు జిల్లాలో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎగువ అహోబిలంలో స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున ప్రత్యేక జలాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. చెంచులక్ష్మి అమ్మవారు, జ్వాలా నరసింహ మూర్తులకు.. గ్రామోత్సవం నిర్వహించారు.

దిగువ అహోబిలంలో శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వామిని అహోబిల మాఢవీధుల్లో విహరింప చేశారు. అహోబిల మఠం 46 పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం శేషవాహనంపై లక్ష్మీనరసింహస్వామి విహరింపజేశారు.

కర్నూలు జిల్లాలో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎగువ అహోబిలంలో స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున ప్రత్యేక జలాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. చెంచులక్ష్మి అమ్మవారు, జ్వాలా నరసింహ మూర్తులకు.. గ్రామోత్సవం నిర్వహించారు.

దిగువ అహోబిలంలో శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వామిని అహోబిల మాఢవీధుల్లో విహరింప చేశారు. అహోబిల మఠం 46 పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం శేషవాహనంపై లక్ష్మీనరసింహస్వామి విహరింపజేశారు.

ఇవీ చూడండి:

ఆలయంలో చోరీ... సీసీ కెమెరాలను సైతం ఎత్తుకెళ్లిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.