రెండు వేర్వేరు కేసుల్లో.. కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2,046 టెట్రా ప్యాకెట్లు, 476 బాటిళ్ల మద్యంతో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ తరహా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. రెండవ పట్టణ సీఐ చంద్ర శేఖర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: