ETV Bharat / state

కన్నతల్లిని బండరాయితో మోది చంపిన కిరాతకుడు

author img

By

Published : Mar 11, 2020, 3:13 PM IST

జులాయిగా తిరగటమే కానీ బాధ్యతలు తెలియని ఓ కుమారుడు తల్లినే హతమార్చాడు. మద్యం సేవించి తల్లిదండ్రులతో గొడవ పడ్డ కిరాతకుడు... అడ్డొచ్చిన తల్లిని బండరాయితో మోది చంపేశాడు.

a son who killed his mother at Emmiganuru in kurnool district
a son who killed his mother at Emmiganuru in kurnool district
కన్నతల్లిని బండ రాయితో మోది చంపిన కిరాతక కొడుకు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తల్లిని రాయితో తలపై మోది కుమారుడు కిరాతకంగా హత్య చేశాడు. లక్ష్మీపేటలో ఉంటున్న రాజు, ఉరుకుందమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పెద్ద కుమారుడు వీరేష్ జులాయిగా తిరుగుతుండగా... చిన్న కొడుకు ఉదయకుమార్ ఎంటెక్, కూతురు త్రిబుల్ ఐటీ చదువుతోంది. వీరేష్ తాగి వచ్చి తండ్రితో గొడవపడ్డాడు. వీరిద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో తండ్రిని బండరాయితో హత్య చేయబోతుండగా.. తల్లి అడ్డుకుంది. అడ్డొచ్చిన తల్లి తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అప్పు తీర్చమంటే..చంపేశారు

కన్నతల్లిని బండ రాయితో మోది చంపిన కిరాతక కొడుకు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తల్లిని రాయితో తలపై మోది కుమారుడు కిరాతకంగా హత్య చేశాడు. లక్ష్మీపేటలో ఉంటున్న రాజు, ఉరుకుందమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పెద్ద కుమారుడు వీరేష్ జులాయిగా తిరుగుతుండగా... చిన్న కొడుకు ఉదయకుమార్ ఎంటెక్, కూతురు త్రిబుల్ ఐటీ చదువుతోంది. వీరేష్ తాగి వచ్చి తండ్రితో గొడవపడ్డాడు. వీరిద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో తండ్రిని బండరాయితో హత్య చేయబోతుండగా.. తల్లి అడ్డుకుంది. అడ్డొచ్చిన తల్లి తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అప్పు తీర్చమంటే..చంపేశారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.