ETV Bharat / state

మొన్న కోళ్లు.. నిన్న దుప్పట్లు.. నేడు కుర్చీలు.. కేటీఆర్ సీఎం కావాలనే..

author img

By

Published : Jan 13, 2023, 10:17 PM IST

Chairs Distributed: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో బీఆర్ఎస్ నేత వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఆకాంక్షిస్తూ వరంగల్ బీఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి పేదలకు 200 కుర్చీలు పంపిణీ చేశారు. వరంగల్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉచితంగా వస్తున్న కుర్చీలు తీసుకోవడానికి ప్రజలు బారులుతీరారు. గతంలో దసరా పండుగను పురస్కరించుకొని రాజనాల శ్రీహరి.. హమాలీ కార్మికులకు కోళ్లను పంపిణీ చేశారు. శీతాకాలం ఆరంభంలో కొంతమంది యాచకులకు దుప్పట్లు అందజేశారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా చిన్నారులకు గాలిపటాలు ఇప్పిస్తానని తెలిపారు. శ్రీహరి చేస్తున్న కార్యక్రమాలను చూసి నగరవాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Chairs Distributed
రాజనాల శ్రీహరి
మొన్న కోళ్లు.. నిన్న దుప్పట్లు.. నేడు కుర్చీలు.. కేటీఆర్ సీఎం కావాలనే..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.