విజయవాడలో ట్రాఫిక్ నియంత్రించేందుకు వేసిన స్పీడ్ బ్రేకర్ లకు రంగులు వేసేందుకు జయహో స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న రాళ్లకు రంగులు లేకపోవడంతో వాహనచోదకులు వేగంగా వెళ్తూ ప్రమాదాల బారిన పడుతుండటం గమనించిన సంస్థ... ఈ కార్యక్రమం చేపట్టిందని జయహో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు జయశ్రీ అన్నారు.
కరోనా నివారణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలతో స్టిక్కర్లను ముద్రించి ప్రజలకు అందిస్తూ కొవిడ్ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: సచివాలయ ఉద్యోగి అనుమానాస్పద మృతి