ETV Bharat / state

'న్యాయమూర్తి రామకృష్ణపై దాడి కక్ష సాధింపే'

author img

By

Published : Jul 16, 2020, 9:59 PM IST

న్యాయమూర్తి రామకృష్ణపై కక్షతోనే దాడి చేశారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. రామకృష్ణ నుంచి ఎస్సై ఎందుకు ఫిర్యాదు స్వీకరించలేదని ప్రశ్నించారు.

varla-ramaih-on-assault-of-ramkrishna
'న్యాయమూర్తి రామకృష్ణపై దాడి కక్ష సాధింపే'

తప్పుడు పనులు చేసేవారిని ముఖ్యమంత్రి అమితంగా ప్రేమిస్తారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. న్యాయమూర్తి రామకృష్ణ రాయచోటిలో విధుల్లో ఉన్నప్పుడు, తాను తీసుకున్న మరణవాంగ్మూలంలో తన తమ్ముడైన పవన్ కుమార్ రెడ్డి పేరును చేర్చాడన్న అక్కసుతోనే... నాగార్జున రెడ్డి కక్ష పెంచుకున్నాడన్నారు.

రామకృష్ణ నుంచి ఫిర్యాదు తీసుకోకపోగా, మంత్రి ఆదేశాలకు ఎస్సై తలొగ్గారని ఆరోపించారు. పెద్దవాళ్లతో పెట్టుకుంటే మీకే నష్టమంటూ హితబోధ చేయడం ఏమిటని మండిపడ్డారు. దళితవర్గానికి చెందిన, మేజిస్ట్రేట్ రామకృష్ణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు తన అధికార బలాన్ని ఉపయోగిస్తున్నారని వర్ల ప్రశ్నించారు.

తప్పుడు పనులు చేసేవారిని ముఖ్యమంత్రి అమితంగా ప్రేమిస్తారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. న్యాయమూర్తి రామకృష్ణ రాయచోటిలో విధుల్లో ఉన్నప్పుడు, తాను తీసుకున్న మరణవాంగ్మూలంలో తన తమ్ముడైన పవన్ కుమార్ రెడ్డి పేరును చేర్చాడన్న అక్కసుతోనే... నాగార్జున రెడ్డి కక్ష పెంచుకున్నాడన్నారు.

రామకృష్ణ నుంచి ఫిర్యాదు తీసుకోకపోగా, మంత్రి ఆదేశాలకు ఎస్సై తలొగ్గారని ఆరోపించారు. పెద్దవాళ్లతో పెట్టుకుంటే మీకే నష్టమంటూ హితబోధ చేయడం ఏమిటని మండిపడ్డారు. దళితవర్గానికి చెందిన, మేజిస్ట్రేట్ రామకృష్ణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు తన అధికార బలాన్ని ఉపయోగిస్తున్నారని వర్ల ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

సోదరుడే హంతకుడు.. రాజకీయంగా పోటీ రావడమే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.