ETV Bharat / state

వల్లభనేని వంశీ వినూత్న ప్రచారం.. ఎడ్లబండిపై రోడ్​ షో

కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ ఎడ్లబండిపై వినూత్న ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలకు రుణం చెల్లించుకునే సమయం వచ్చిందంటూ ఓట్లు అభ్యర్థించారు.

author img

By

Published : Apr 6, 2019, 3:51 PM IST

ఎడ్లబండిపై వల్లభనేని వంశీ వినూత్న ప్రచారం

చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉందంటూ గన్నవరం తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఎడ్లబండిపై రోడ్​షోలో పాల్గొని.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. సంక్షేమ పథకాలకు రుణం చెల్లించుకునే సమయం వచ్చిందంటూ ఓట్లు అభ్యర్థించారు.

ఎడ్లబండిపై వల్లభనేని వంశీ వినూత్న ప్రచారం

చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉందంటూ గన్నవరం తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఎడ్లబండిపై రోడ్​షోలో పాల్గొని.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. సంక్షేమ పథకాలకు రుణం చెల్లించుకునే సమయం వచ్చిందంటూ ఓట్లు అభ్యర్థించారు.

ఎడ్లబండిపై వల్లభనేని వంశీ వినూత్న ప్రచారం

ఇవీ చదవండి..

తెలుగు ప్రజలకు చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు

Intro:ap_rjy_61_07_poll_campaign_prathipadu_c10


Body:ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంత నియోజకవర్గ మైన ప్రతిపాడులో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నాయి.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల రాజా సోదరీమణులు కల్పన. క్రాంతులు మరియు సతీమణి సత్య ప్రభ లు రాజా ను గెలిపించాలని కోరుతూ గ్రామాల్లో తిరుగుతూ ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు..ప్రతిపాడు శంఖవరం రౌతులపూడి ఏలేశ్వరం మండలాల్లో ప్రతీ గ్రామంలో సమస్యలు అడుగుతున్నారు.. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి తెలియజేస్తున్నారు..ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఒకమారు ప్రచారం పూర్తి చేసిన ఈ ముగ్గురూ మరోసారి గ్రామాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు..వైస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ కుటుంబీకులు వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వ ప్రసాద్ లు వైస్సార్సీపీ ని గెలిపించటానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు..ఇప్పటికే నియోజకవర్గం అంత ఒకసారి ప్రచారం పూర్తి చేసిన వీరు ఎన్నికల వ్యూహంలో నిమగ్నమయ్యారు.. ప్రచారం చేస్తూనే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచించికొంటూ ముందుకు వెళ్తున్నారు..మరో ప్రధాన పార్టీ జనసేన కూడా ఇక్కడ ప్రచారంలో దూసుకుపోతుంది..పవన్ చరిష్మా వారిని గెలిపిస్తుందని నమ్మకంతో వారు ఉన్నారు...బైట్స్...శ్రీనివాసరావు ప్రతిపాడు శ్రీనివాసరావు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.