ETV Bharat / state

పసుపు రైతులను అడ్డుకున్న పోలీసులు

రైతుల పంట ఉత్పత్తుల రవాణాను అడ్డుకోవద్దని ప్రభుత్వాలు చెబుతున్నా కొన్నిచోట్ల అలా జరగటం లేదు. పసుపు లోడుతో కృష్ణా జిల్లాలోని మోపిదేవి వార్పు వద్ద వేబ్రిడ్జి కాటా కోసం వచ్చిన ట్రాక్టర్​ను పోలీసులు అడ్డుకుని వెనక్కు పంపారు.

author img

By

Published : Apr 16, 2020, 8:20 PM IST

turmeric farmers
turmeric farmers
turmeric farmers
పసుపు లోడు ట్రాక్టర్​తో రైతులు

కృష్ణా జిల్లాలోని మోపిదేవి, చల్లపల్లి మండలాల్లోని లంక భూముల్లో వేల ఎకరాల్లో పసుపు పండిస్తారు. ఆ పచ్చి పసుపును గుంటూరు జిల్లా వ్యాపారులు కృష్ణా జిల్లా వచ్చి కొనుగోలు చేసేవారు. ఈ సంవత్సరం లాక్​డౌన్ ప్రభావంతో కృష్ణా, గుంటూరు జిల్లా సరిహద్దుల్లో పొలీస్​ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మోపిదేవి వార్పు వద్ద వేబ్రిడ్జి కాటా కోసం వచ్చిన ట్రాక్టర్​ని పోలీసులు తిప్పి పంపారు. అవనిగడ్డ ఎస్​ఐ నుంచి లేఖ తీసుకువస్తేనే ట్రాక్టర్​కు అనుమతి ఇస్తామని తెలిపారు. ఇలా అయితే పసుపు పంట కొనేవారు లేక నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు క్రింది స్థాయి వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

turmeric farmers
పసుపు లోడు ట్రాక్టర్​తో రైతులు

కృష్ణా జిల్లాలోని మోపిదేవి, చల్లపల్లి మండలాల్లోని లంక భూముల్లో వేల ఎకరాల్లో పసుపు పండిస్తారు. ఆ పచ్చి పసుపును గుంటూరు జిల్లా వ్యాపారులు కృష్ణా జిల్లా వచ్చి కొనుగోలు చేసేవారు. ఈ సంవత్సరం లాక్​డౌన్ ప్రభావంతో కృష్ణా, గుంటూరు జిల్లా సరిహద్దుల్లో పొలీస్​ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మోపిదేవి వార్పు వద్ద వేబ్రిడ్జి కాటా కోసం వచ్చిన ట్రాక్టర్​ని పోలీసులు తిప్పి పంపారు. అవనిగడ్డ ఎస్​ఐ నుంచి లేఖ తీసుకువస్తేనే ట్రాక్టర్​కు అనుమతి ఇస్తామని తెలిపారు. ఇలా అయితే పసుపు పంట కొనేవారు లేక నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు క్రింది స్థాయి వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

వాళ్లకు సాయం చేయడంలో ఏపీ విఫలం: ఒడిశా ఎంపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.