ETV Bharat / state

టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణా శిబిరం - మైలవరంలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల శిక్షణ శిబిరం

కృష్ణా జిల్లా మైలవరంలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల కోసం శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. అతివలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ఉద్దేశంతో నెలకొల్పిన ఈ శిబిరాన్ని.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు.

training centre for women
టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల కోసం శిక్షణ శిబిరం ఏర్పాటు
author img

By

Published : Oct 22, 2020, 7:23 PM IST

నిరుపేద మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ఉద్దేశంతో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని.. కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. స్థానిక సీఎంఆర్ ఫంక్షన్ హాలులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ.. మహిళా ప్రగతికి కృషి చేస్తున్న టాటా ట్రస్ట్ సేవలను కొనియాడారు. అదే విధంగా ఆ ప్రాంతంలో మహిళలకు తోడ్పాటు అందిస్తున్న మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయ సుధని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, టాటా ట్రస్ట్ సిబ్బంది, మదర్ థెరిస్సా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

నిరుపేద మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ఉద్దేశంతో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని.. కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. స్థానిక సీఎంఆర్ ఫంక్షన్ హాలులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ.. మహిళా ప్రగతికి కృషి చేస్తున్న టాటా ట్రస్ట్ సేవలను కొనియాడారు. అదే విధంగా ఆ ప్రాంతంలో మహిళలకు తోడ్పాటు అందిస్తున్న మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయ సుధని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, టాటా ట్రస్ట్ సిబ్బంది, మదర్ థెరిస్సా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

లేబుల్‌ మిలటరీది... సరకు నకిలీది...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.