ETV Bharat / state

మద్యం అప్పుగా ఇవ్వనన్నాడు.. చితక్కొట్టారు

author img

By

Published : May 17, 2022, 4:35 PM IST

Updated : May 17, 2022, 5:29 PM IST

Attack: మద్యం అప్పుగా ఇవ్వనన్నందుకు.. మందుబాబులు వీరంగం సృష్టించారు. దుకాణ సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించారు. ఆ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజిలో నమోదయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

liquor store
liquor store

Attack on Liquor Store Staff: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ప్రభుత్వ మద్యం దుకాణంలో.. మద్యం అప్పు ఇవ్వనందుకు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మద్యం అప్పుఇవ్వలేదని.. మందుబాబులు రెచ్చిపోయారు.. ఏకంగా..

గోపువానిపాలెంలోని మద్యం దుకాణం వద్దకు మందుబాబులు వచ్చారు. మద్యం అప్పుగా కావాలని అడిగారు. సేల్స్​మెన్​ గొరిపర్తి శ్రీనివాసరావు కదరదని చెప్పాడు. దాంతో ఆగ్రహానికి గురైన మందుబాబులు.. శ్రీనివాసరావుపై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.

మందుబాబుల దాడిలో గాయపడిన గొరిపర్తి శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులు అధికార పార్టీకి చెందినవారు కావటంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడు కోరారు.

ఇదీ చదవండి: మందుబాబుల వీరంగం... ఎక్సైజ్ కానిస్టేబుళ్లపై దాడి

Attack on Liquor Store Staff: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ప్రభుత్వ మద్యం దుకాణంలో.. మద్యం అప్పు ఇవ్వనందుకు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మద్యం అప్పుఇవ్వలేదని.. మందుబాబులు రెచ్చిపోయారు.. ఏకంగా..

గోపువానిపాలెంలోని మద్యం దుకాణం వద్దకు మందుబాబులు వచ్చారు. మద్యం అప్పుగా కావాలని అడిగారు. సేల్స్​మెన్​ గొరిపర్తి శ్రీనివాసరావు కదరదని చెప్పాడు. దాంతో ఆగ్రహానికి గురైన మందుబాబులు.. శ్రీనివాసరావుపై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.

మందుబాబుల దాడిలో గాయపడిన గొరిపర్తి శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులు అధికార పార్టీకి చెందినవారు కావటంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడు కోరారు.

ఇదీ చదవండి: మందుబాబుల వీరంగం... ఎక్సైజ్ కానిస్టేబుళ్లపై దాడి

Last Updated : May 17, 2022, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.