ETV Bharat / state

తెగిన విద్యుత్ తీగలు తగిలి మూడు గేదెలు మృతి

author img

By

Published : Dec 13, 2020, 7:20 PM IST

తెగిపడిన విద్యుత్ తీగలు కాళ్లకు తగిలి మూడ గేదెలు మరణించిన ఘటన.. విజయవాడ రూరల్ పాతపాడులో జరిగింది. ఇద్దరు గ్రామస్థులకు చెందిన పశువుల మరణంతో.. ఆ పాడి రైతులు కన్నీరు పెట్టుకున్నారు.

buffalos dead
విద్యుుదాఘాతంతో గేదెలు మృతి

విజయవాడ రూరల్ పాతపాడు శివారులోని పంట పొలాల్లో తెగిపడిన విద్యుత్ తీగలు.. మూడు గేదెలను బలితీసుకున్నాయి. గ్రామం సమీపంలోని ఎర్ర చెరువు చేలలో మేతకు వెళ్లిన పశువులు.. తెగిపడిన తీగను దాటుతుండగా గేదెల కాళ్లకు తగిలి అక్కడిక్కడే మృతి చెందాయి.

మృతిచెందిన పశువుల్లో రెండు పాతపాడుకి చెందిన మరీదు జమలయ్యవని, పొన్నగంటి శ్రీనివాసరావుకు చెందిన మరొక గేదె ఉందని గ్రామస్థులు తెలిపారు. జీవనాధరమైన పశువులు చనిపోగా.. రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

విజయవాడ రూరల్ పాతపాడు శివారులోని పంట పొలాల్లో తెగిపడిన విద్యుత్ తీగలు.. మూడు గేదెలను బలితీసుకున్నాయి. గ్రామం సమీపంలోని ఎర్ర చెరువు చేలలో మేతకు వెళ్లిన పశువులు.. తెగిపడిన తీగను దాటుతుండగా గేదెల కాళ్లకు తగిలి అక్కడిక్కడే మృతి చెందాయి.

మృతిచెందిన పశువుల్లో రెండు పాతపాడుకి చెందిన మరీదు జమలయ్యవని, పొన్నగంటి శ్రీనివాసరావుకు చెందిన మరొక గేదె ఉందని గ్రామస్థులు తెలిపారు. జీవనాధరమైన పశువులు చనిపోగా.. రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఇదీ చదవండి:

వేధిస్తున్న వైద్యుల కొరత... వాయిదా పడుతున్న శస్త్రచికిత్సలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.