కుటుంబ కలహాల నేపథ్యంలో విడిపోయిన దంపతులు జస్టిస్ ప్రసన్నలత చొరవతో దంపతుల ఒక్కటయ్యారు. ఆ దంపతులు కలుసుకోటానికి కృష్ణా జిల్లా తిరువూరు జేఎఫ్సీఎమ్ కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ వేదికయ్యింది. తిరువూరు, ఏ కొండూరు, విసన్నపేట, చాట్రాయి, గంపలగూడెం పోలీస్ స్టేషన్లో.... బాధితుల ఫిర్యాదు మేరకు గతంలో వరకట్న వేధింపులు, గృహహింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరు మహిళలు తమ భర్తల నుంచి మనోవర్తి ఇప్పించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోక్ అదాలత్ సందర్భంగా జస్టిస్ ప్రసన్నలత.... భార్య భర్తలకు ఇచ్చిన కౌన్సిలింగ్ ఫలించింది. తాము తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని సుముఖత వ్యక్తం చేశారు. న్యాయవాదులు, పోలీసుల సమక్షంలో న్యాయమూర్తి ఇచ్చిన పూల మాలలను పరస్పరం మార్చుకున్న పది మంది దంపతులు ఒక్కటయ్యారు. న్యాయస్థానం చరిత్రలో సరికొత్త అధ్యాయానికి ఈ సందర్భం శ్రీకారంగా మారింది.
ఇదీ చూడండి: దక్షిణాఫ్రికా జంట... భారతీయ సంప్రదాయంలో ఒక్కటైంది..!