ETV Bharat / state

పాలన చేతకాక.. దౌర్జన్య కాండ : అనగాని సత్యప్రసాద్

author img

By

Published : Jun 12, 2020, 3:25 PM IST

తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మీద పెట్టిన కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపేనని ఆ పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆరోపించారు. బలహీన వర్గాలంటే ముఖ్యమంత్రికి ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు.

tdp mla anagani
tdp mla anagani

మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్ట్​పై తెదేపా నేతలు మండిపడుతున్నారు. బీసీ నేతలపై ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధిస్తున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. బలహీన వర్గాలంటే ఇంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్.. జగన్​మోహన్​రెడ్డి నియంత పాలన, దౌర్జన్యకాండకు నిదర్శమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అనగాని సత్యప్రసాద్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రికి పాలన చేతకాక అభివృద్ధిని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చడానికి దాడులు, అణచివేతలు, వేధింపులు, ప్రతీకారంతో కాలం నెట్టుకొస్తున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్ట్​పై తెదేపా నేతలు మండిపడుతున్నారు. బీసీ నేతలపై ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధిస్తున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. బలహీన వర్గాలంటే ఇంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్.. జగన్​మోహన్​రెడ్డి నియంత పాలన, దౌర్జన్యకాండకు నిదర్శమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అనగాని సత్యప్రసాద్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రికి పాలన చేతకాక అభివృద్ధిని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చడానికి దాడులు, అణచివేతలు, వేధింపులు, ప్రతీకారంతో కాలం నెట్టుకొస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: 'బాబాయ్​ని అరెస్టు చేసింది ఏసీబీనా?... గూండాలా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.