ETV Bharat / state

ఆ ఏడుగురు మంత్రులు... వైకాపా జాతిరత్నాలు: పంచుమర్తి అనురాధ - panchumarthi anuradha latest news

తిరుపతి ఉపఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్న వైకాపా మంత్రులపై.. పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైకాపా మంత్రులకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.

tdp panchumarthi anuradha
పంచుమర్తి అనురాధ
author img

By

Published : Apr 7, 2021, 1:35 PM IST

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఏడు నియోజకవర్గాలకు ఏడుగురు దందారాయుళ్లుగా.. వైకాపా జాతిరత్నాలు దిగారంటూ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మైనింగ్​లో అక్రమంగా సంపాదిస్తున్న బాలినేని వెంకటగిరి వెళ్తే, పాఠశాలల్లో కరోనా తీవ్రతపై కనీస సమీక్ష చేయని విద్యాశాఖ మంత్రి సర్వేపల్లికి ప్రచారం చేసేందుకు వెళ్లారని మండిపడ్డారు. పేకాట క్లబ్​లు తెరిచేందుకు కొడాలి నాని సత్యవేడుకు, చంద్రబాబు తీసుకొచ్చిన పరిశ్రమల్ని తరిమికొట్టిన మేకపాటి వెంకటగిరిలో ప్రచారం చేయటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఖరీఫ్, రబీకి తేడా తెలియని కన్నబాబు శ్రీకాళహస్తిలో, క్రికెట్ బెట్టింగ్​లు నిర్వహించే మంత్రి అనిల్ గూడురులో ఇన్​ఛార్జ్ మంత్రులుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేర్ని నాని ఏ మెుహం పెట్టుకుని తిరుపతి ప్రజలను ఓటడుగుతున్నారని నిలదీశారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ఆగడాలకు అంతే లేదన్న అనురాధ..., వైకాపా మంత్రుల బెదిరింపులకు భయపడకుండా తిరుపతి ప్రజలు తెదేపాకు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.