ETV Bharat / state

'ప్రభుత్వం సీరియస్​గా తీసుకోకపోవడం వల్లే వింత వ్యాధి ఎక్కువైంది'

author img

By

Published : Dec 12, 2020, 4:47 PM IST

ప్రభుత్వం సీరియస్​గా తీసుకోకపోవడం వల్లే ఏలూరులో వింత వ్యాధి ఎక్కువైందని... తెదేపా నేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఈ రోజుకీ వ్యాధికి గల కారణాలను చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇప్పటికీ స్పెషల్ డ్రైవ్ పెట్టి రక్త నమూనాలు సేకరించలేదని.. వైద్యారోగ్యం, మున్సిపల్, జలవనరుల శాఖల మధ్య సమన్వయం లేదని రామానాయుడు మండిపడ్డారు.

nimmala ramanaidu
నిమ్మల రామానాయుడు, తెదేపా నేత

ఏలూరు వింతవ్యాధి ఘటనకు నాసిరకం క్లోరినే కారణమని వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయించట్లేదని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. వింతవ్యాధి, మాస్ హిస్టీరియా వచ్చింది ముఖ్యమంత్రి, మంత్రులకేనన్నారు. ఈ రోజుకీ వ్యాధికి గల కారణాలను చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇంతవరకూ పరీక్షల ఫలితాలు బయటపెట్టలేదని అన్నారు.

లోకేశ్ ఏలూరు పర్యటన తర్వాతే సీఎం స్పందించి పెళ్లికి వెళ్తూ మొక్కుబడిగా వచ్చి బాధితులను పరామర్శించారని మండిపడ్డారు. వింత వ్యాధి వెలుగులోకి వచ్చిన 5వ తేదీకి 2 వారాల ముందే పంపుల చెరువు ప్రాంతంలో ఒకరిద్దరిలో వ్యాధి లక్షణాలు బయటపడినా.. ప్రభుత్వం సీరియస్​గా తీసుకోకపోవటం వల్లే అది తీవ్రమైందన్నారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు ఎందుకు దీనిని గుర్తించలేకపోయాయని రామానాయుడు నిలదీశారు.

ముఖ్యమంత్రి పర్యటన తర్వాత కూడా హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్స్, ప్రత్యేక వైద్య నిపుణుల్ని ఏర్పాటు చేయలేదన్నారు. పరిస్థితి విషమించిన వారిని విజయవాడ, గుంటూరుకు పంపటంలో ఆలస్యమైన కారణంగా కొందరు చనిపోయారన్నారు. ఇప్పటికీ స్పెషల్ డ్రైవ్ పెట్టి రక్తనమూనాలు సేకరించలేదని.. వైద్యారోగ్యం, మున్సిపల్, జలవనరుల శాఖల మధ్య సమన్వయం లేదని రామానాయుడు మండిపడ్డారు.

ఏలూరు వింతవ్యాధి ఘటనకు నాసిరకం క్లోరినే కారణమని వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయించట్లేదని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. వింతవ్యాధి, మాస్ హిస్టీరియా వచ్చింది ముఖ్యమంత్రి, మంత్రులకేనన్నారు. ఈ రోజుకీ వ్యాధికి గల కారణాలను చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇంతవరకూ పరీక్షల ఫలితాలు బయటపెట్టలేదని అన్నారు.

లోకేశ్ ఏలూరు పర్యటన తర్వాతే సీఎం స్పందించి పెళ్లికి వెళ్తూ మొక్కుబడిగా వచ్చి బాధితులను పరామర్శించారని మండిపడ్డారు. వింత వ్యాధి వెలుగులోకి వచ్చిన 5వ తేదీకి 2 వారాల ముందే పంపుల చెరువు ప్రాంతంలో ఒకరిద్దరిలో వ్యాధి లక్షణాలు బయటపడినా.. ప్రభుత్వం సీరియస్​గా తీసుకోకపోవటం వల్లే అది తీవ్రమైందన్నారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు ఎందుకు దీనిని గుర్తించలేకపోయాయని రామానాయుడు నిలదీశారు.

ముఖ్యమంత్రి పర్యటన తర్వాత కూడా హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్స్, ప్రత్యేక వైద్య నిపుణుల్ని ఏర్పాటు చేయలేదన్నారు. పరిస్థితి విషమించిన వారిని విజయవాడ, గుంటూరుకు పంపటంలో ఆలస్యమైన కారణంగా కొందరు చనిపోయారన్నారు. ఇప్పటికీ స్పెషల్ డ్రైవ్ పెట్టి రక్తనమూనాలు సేకరించలేదని.. వైద్యారోగ్యం, మున్సిపల్, జలవనరుల శాఖల మధ్య సమన్వయం లేదని రామానాయుడు మండిపడ్డారు.

ఇవీ చదవండి..

అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న నిహారిక, చైతన్య దంపతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.