కృష్ణాజిల్లా చల్లపల్లిలో 'స్వచ్ఛ చల్లపల్లి' పేరుతో చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని చుట్టు పక్కల పల్లెలు స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నాయి. చల్లపల్లి మండలంలోని యార్లగడ్డ గ్రామంలో 544 రోజులుగా స్వచ్ఛత పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వీధులు శుభ్రం చేయటం, ప్రతి ఇంటి చెత్తను సేకరించడం, గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. వాటికి ప్రతిరోజు ట్యాంకర్ ద్వారా వాటికి నీరందిస్తూ..సంరక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: ' గాంధీ పార్క్ అత్యంత సుందరంగా తీర్చుదిద్దుతాం'
విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న యార్లగడ్డ రమేశ్ బాబు తన స్వగ్రామమైన నెలకు రూ.20 వేలు విరాళంగా అందిస్తున్నారు. స్వచ్ఛ యార్లగడ్డలో భాగస్వామి అవటం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. గ్రామ జనాభా 1700మంది.. ఇప్పటివరకు 2500 మొక్కలు నాటినట్లు వీఆర్వో తూము వెంకటేశ్వర రావు తెలిపారు. స్వచ్ఛ చల్లపల్లి స్ఫూర్తితో స్వచ్ఛ యార్లగడ్డ మొదలు పెట్టామని అన్నారు. ఇంటింటికి చెత్త డబ్బాలు ఇచ్చి.. రోడ్లపై చెత్త వేయకుండా నియంత్రించగలిగామని గ్రామ సర్పంచ్ తెలిపారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఇప్పుడు గ్రామం స్వచ్ఛంగా ఉంటోందని ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: స్వచ్ఛ హీరోయిన్ : పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టిన హైదరాబాదీ