ETV Bharat / state

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి - student died with current shock in avani gadda

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ గురుకుల పాఠశాలలో విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి మరణించాడు. పాఠశాల ఆవరణలోని బాత్రూంపైకి ఎక్కి ఇనుపరాడ్​తో కొబ్బరికాయలు కోస్తుండగా కరెంట్​ షాక్ తగిలింది.

student died with current shock in avani gadda
అవనిగడ్డలో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
author img

By

Published : Mar 16, 2020, 2:37 PM IST

అవనిగడ్డలో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ గురుకుల పాఠశాలలో విద్యుదాఘాతంతో ఓ విద్యార్ధి మృతి చెందాడు. నాగయలంక మండలం గుల్లలమోదకు చెందిన విశ్వనాధపల్లి ఉదయ్(14) పులిగడ్డ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. నిన్న రాత్రి పాఠశాల ఆవరణలోని బాత్రూంపైకి ఎక్కి ఇనుపరాడ్​తో కొబ్బరికాయలు కోస్తుండగా విద్యదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఉదయ్ శరీరం, దుస్తులపై మంటలు వ్యాపించడంతో కుప్పకూలి పడిపోయి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్​బాబు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో విధ్వంసపాలన సాగుతోంది: చంద్రబాబు

అవనిగడ్డలో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ గురుకుల పాఠశాలలో విద్యుదాఘాతంతో ఓ విద్యార్ధి మృతి చెందాడు. నాగయలంక మండలం గుల్లలమోదకు చెందిన విశ్వనాధపల్లి ఉదయ్(14) పులిగడ్డ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. నిన్న రాత్రి పాఠశాల ఆవరణలోని బాత్రూంపైకి ఎక్కి ఇనుపరాడ్​తో కొబ్బరికాయలు కోస్తుండగా విద్యదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఉదయ్ శరీరం, దుస్తులపై మంటలు వ్యాపించడంతో కుప్పకూలి పడిపోయి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్​బాబు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో విధ్వంసపాలన సాగుతోంది: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.